Share News

CM Jagan: గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జగన్

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:07 PM

నేడు మహాత్మాగాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా రాజకీయ నాయకులంతా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం మహాత్ముని వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

CM Jagan: గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జగన్

అమరావతి: నేడు మహాత్మాగాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా రాజకీయ నాయకులంతా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం మహాత్ముని వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తన ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశానంటూ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

‘‘సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను’’ అని జగన్ పేర్కొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:07 PM