Share News

AP News: గాల్లో చెక్కర్లు కొట్టిన విమానాలు.. ఆందోళనలో ప్రయాణికులు

ABN , Publish Date - Jan 15 , 2024 | 09:57 AM

Andhrapradesh: గమ్యం చేరాల్సిన విమానాలు గాల్లోనే పలు మార్లు చెక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. చెన్నై, బెంగళూరు ఇండిగో విమానాలు గాలిలో చక్కెర్లు కొట్టాయి.

AP News: గాల్లో చెక్కర్లు కొట్టిన విమానాలు.. ఆందోళనలో ప్రయాణికులు

కృష్ణా, జనవరి 15: గమ్యం చేరాల్సిన విమానాలు గాల్లోనే పలు మార్లు చెక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. చెన్నై, బెంగళూరు ఇండిగో విమానాలు గాలిలో చక్కెర్లు కొట్టాయి. పొగ మంచు కారణంగా బెంగళూరు ఇండిగో విమానం గన్నవరం ఎయిర్ పోర్ట్ చుట్టూ చక్కెర్లు కొడుతోంది. అలాగే చెన్నై నుంచి వచ్చిన ఇండిగో విమానం గుడివాడ, ముదినేపల్లి పరిసర ప్రాంతాల్లో గాలిలో చక్కెర్లు కొడుతోంది. సుమారు గంట నుంచి విమానాలు గాలిలోనే చక్కెర్లు కొడుతున్నాయి. విమానాలను సేఫ్‌గా లాండ్ చేసేందుకు పైలెట్లు యత్నిస్తున్నారు. చివరకు చెన్నై విమానం సురక్షితంగా గన్నవరం రన్వే పైకి చేరడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 15 , 2024 | 11:02 AM