Share News

Chandra Babu: విభజన కంటే జగన్ పాలనలోనే ఎక్కువ నష్టం: బిగ్ డిబేట్‌లో చంద్రబాబు

ABN , Publish Date - May 08 , 2024 | 09:49 PM

వైఎస్ జగన్ మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని, విభజన కంటే జగన్ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఏబీఎన్ 'బిగ్ డిబేట్' ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ఆదాయాన్ని పెంచుతామని చెప్పారు.

Chandra Babu: విభజన కంటే జగన్ పాలనలోనే ఎక్కువ నష్టం: బిగ్ డిబేట్‌లో చంద్రబాబు

హైదరాబాద్: వైఎస్ జగన్ (YS Jagan) మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని, విభజన కంటే జగన్ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అన్నారు. ఏబీఎన్ 'బిగ్ డిబేట్' (ABN Big Debate) ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ఆదాయాన్ని పెంచుతామని చెప్పారు. జగన్ కంటే మంచిగా సంక్షేమాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేశారు. ప్రజలు తెలుగుదేశం మేనిఫెస్టోను బలంగా నమ్మారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా పనిచేస్తాయని భరోసా ఇచ్చారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రజల కోసం, తనను నమ్మిన జనం కోసం జీవితాంతం పనిచేస్తానని తెలిపారు.

Updated Date - May 08 , 2024 | 09:55 PM