Share News

TS News: మణికొండలో కారు బీభత్సం..

ABN , Publish Date - Jun 11 , 2024 | 08:23 AM

మణికొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గోల్డన్ టెంపుల్ వద్ద రోడ్డుపై పార్క్ చేసిన మోటర్ సైకిళ్లను ఢీ కొట్టుకుంటూ కారు దూసుకెళ్లింది. అక్కడ నిలిపి ఉంచిన 20 మోటార్ సైకిళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. కారును వెంబడించి మరీ కాలనీ వాసులు పట్టుకున్నారు. కారును నడిపింది మైనర్ బాలుడని తెలుస్తోంది.

TS News: మణికొండలో కారు బీభత్సం..

రంగారెడ్డి: మణికొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గోల్డన్ టెంపుల్ వద్ద రోడ్డుపై పార్క్ చేసిన మోటర్ సైకిళ్లను ఢీ కొట్టుకుంటూ కారు దూసుకెళ్లింది. అక్కడ నిలిపి ఉంచిన 20 మోటార్ సైకిళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. కారును వెంబడించి మరీ కాలనీ వాసులు పట్టుకున్నారు. కారును నడిపింది మైనర్ బాలుడని తెలుస్తోంది. కాలనీ వాసులు వెంబడించే సరికి కారును బయట పెట్టేసి సదరు మైనర్ బాలుడు ఇంట్లోకి పరుగులు తీశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 11 , 2024 | 08:23 AM