Share News

TDP: సైకిల్‌ గుర్తుకు ఓటేయండి: అశ్మితరెడ్డి

ABN , Publish Date - May 08 , 2024 | 11:48 PM

ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని మెయినబజారు, చిన్నబజారులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

TDP: సైకిల్‌ గుర్తుకు ఓటేయండి: అశ్మితరెడ్డి
వృద్ధురాలితో మాట్లాడుతున్న జేసీ అశ్మితరెడ్డి

తాడిపత్రిటౌన, మే8: ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని మెయినబజారు, చిన్నబజారులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తుకు చేసుకొని ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో జనసేన నియోజకవర్గ ఇనచార్జి కదిరి శ్రీకాంతరెడ్డి, నియాజ్‌బాషా, ఖాదర్‌బాషా, రోషన్న, పవనకుమార్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, మహమ్మద్‌ బాషా, ప్రసాద్‌ పాల్గొన్నారు.


ముస్లింలు ఎప్పటికీ టీడీపీ వైపే: ముస్లింలు ఎప్పటికీ టీడీపీ వైపే ఉంటారని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. స్థానిక నివాసంలో బుధవారం మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి, కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డిలను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్ఛం అందించారు. ఆయన మాట్లాడుతూ ముస్లింలు అందరూ వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అండగా ఉంటారన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:48 PM