Share News

పరిటాల ప్రచారం ప్రారంభం

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:34 PM

దివంగత నేత పరిటాల రవీంద్ర నుంచి సెంటిమెంట్‌గా వస్తున్న ఎన్నికల ప్రచారాన్ని ఆయన సతీమణి పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్‌ కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల నుంచి గురువారం ప్రారంభించారు. గ్రామంలోని రామాలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు.

పరిటాల ప్రచారం ప్రారంభం
paritala sunitha

ధర్మవరంరూరల్‌, ఏప్రిల్‌ 18: దివంగత నేత పరిటాల రవీంద్ర నుంచి సెంటిమెంట్‌గా వస్తున్న ఎన్నికల ప్రచారాన్ని ఆయన సతీమణి పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్‌ కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల నుంచి గురువారం ప్రారంభించారు. గ్రామంలోని రామాలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రచారంలో పరిటాల సునీత మనవడు జూని యర్‌ పరిటాల రవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం గ్రామంలో రోడ్‌ షో నిర్వహించారు.


పరిటాల సునీత, శ్రీరామ్‌ మాట్లాడుతూ ముత్తవకుంట్ల గ్రామం అన్నది మాకు సెంటిమెంట్‌ అని, తమ కుటుంబంలోని ఏ కార్యక్ర మం మొదలు పెట్టినా ముత్తవకుంట్ల రామాలయంలో పూజలు చేసిన అనంతరమే ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలోని ముత్తవకుంట్ల గ్రామం నుంచే వైసీపీ పతనం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెట్టెం వెంకటేష్‌, కన్వీనర్‌ యాతం పోతలయ్య, ముకుం దనాయుడు, సర్పంచ ఈడిగ రామాంజినేయలు, ఆంజనేయులు పాల్గొన్నారు.


మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 19 , 2024 | 11:39 AM