పార్టీ మారిన వారిని చెత్తతో పోలుస్తావా..!
ABN , Publish Date - Apr 19 , 2024 | 11:55 PM
‘ కురుబలు, బోయలు, ఎస్సీ, ఎస్టీల ఓట్లుతో గెలిచి అధికారంలోకి వచ్చిన ప్రకాష్రెడ్డి.. ఆయన విధానాలు నచ్చక పార్టీ మారితే వారిని చెత్తతో పోలుస్తావా... ప్రకాష్రెడ్డి నిన్ను ఇంటికి పంపే రోజులు దగ్గర్లలోనే ఉన్నాయి.. ’ అని మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.
ధర్మవరంరూరల్, ఏప్రిల్ 19: ‘ కురుబలు, బోయలు, ఎస్సీ, ఎస్టీల ఓట్లుతో గెలిచి అధికారంలోకి వచ్చిన ప్రకాష్రెడ్డి.. ఆయన విధానాలు నచ్చక పార్టీ మారితే వారిని చెత్తతో పోలుస్తావా... ప్రకాష్రెడ్డి నిన్ను ఇంటికి పంపే రోజులు దగ్గర్లలోనే ఉన్నాయి.. ’ అని మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. శుక్రవారం కనగానపల్లి మండలంలోని కోనాపురం, బాలేపాళ్యం, తల్లిమడుగుల గ్రామాల్లో వారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వారికి ఆయా గ్రామస్థులు భారీ గజమాలలతో.. హారతులు పట్టి స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. వారు మాట్లాడుతూ.. ప్రకాష్రెడ్డి.. ఎన్నికల ముందు అబద్దాలు చెప్పి బీసీ, బడుగు బలహీన వర్గాలను నమ్మించి ఓట్లు వేయించుకుని గెలిచిన అనంతరం వారిని అన్నివిధలా మోసం చేశారన్నారు. ఆ అహంకారాన్ని దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఆ అరాచకాలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గత టీడీపీ హాయంలో కోనాపురం చెరువుకు హంద్రీనీవా కాలువ నుంచి నీరు ఇచ్చామన్నారు. అయితే ఇప్పుడు కనగానపల్లి చెరువుకు కూడా నీళ్లురావడానికి బాలేపాళ్యం దగ్గర సప్లైఛానల్ను పూడ్చివేసినా ఘనత ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డికే దక్కుతుం దన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పేరూరు డ్యాంకు నీరు తెచ్చి రాప్తాడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెట్టెం వెంకటేష్, కన్వీనర్ యాతం పోతలయ్య, మాజీ జడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, సర్పంచ రామాంజి, అంకే రామకృష్ణ, ముకుందనాయుడు, మనోహర్నాయుడు, బట్టాసురేష్చౌదరి, ముత్యాలు, ముకుంద, సంజీవు, రామస్వామి, ఎస్సీసెల్ విజయ్, రాములమ్మ, బిల్లేదాము పాల్గొన్నారు.