Share News

Acid Attack: నిద్రిస్తున్న వ్యక్తిపై అర్ధరాత్రి యాసిడి దాడి..

ABN , Publish Date - Apr 01 , 2024 | 07:44 AM

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ప్రగడ నాగేశ్వరరావు (60) అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోశారు. యాసిడ్ దాడిలో నాగేశ్వరరావుకి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్త అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Acid Attack: నిద్రిస్తున్న వ్యక్తిపై అర్ధరాత్రి యాసిడి దాడి..

ఏలూరు: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ప్రగడ నాగేశ్వరరావు (60) అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోశారు. యాసిడ్ దాడి (Acid Attack)లో నాగేశ్వరరావుకి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్త అంబులెన్స్‌ (Ambulance)లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. బాధితుడి వద్ద జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, సీఐ రాజేష్ వివరాలు సేకరించారు. యాసిడ్ దాడికి పాల్పడింది ఎవరనేది ఇంతవరకూ తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జగన్‌ చేసింది అప్పులే

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 07:44 AM