Share News

YS Sharmila: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొడుకు రాజారెడ్డి, కూతురు అంజిలి రెడ్డికి వైఎస్ షర్మిల శుభాకాంక్షలు.. ఫ్యామిలీ ఫొటోలు ఇవిగో...

ABN , Publish Date - Dec 20 , 2023 | 01:45 PM

వైఎస్సార్‌టీపీ వ్యవస్థాపకురాలు, ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజిలి రెడ్డి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షర్మిల వెల్లడించారు. తన పిల్లలు చదువుకు సంబంధించిన కీలక మైలురాళ్లను పూర్తి చేసుకోవడం మనసుకు ఆనందంగా ఉందన్నారు.

YS Sharmila: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొడుకు రాజారెడ్డి, కూతురు అంజిలి రెడ్డికి వైఎస్ షర్మిల శుభాకాంక్షలు.. ఫ్యామిలీ ఫొటోలు ఇవిగో...

వైఎస్సార్‌టీపీ వ్యవస్థాపకురాలు, ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజిలి రెడ్డి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షర్మిల వెల్లడించారు. తన పిల్లలు చదువుకు సంబంధించిన కీలక మైలురాళ్లను పూర్తి చేసుకోవడం మనసుకు ఆనందంగా ఉందన్నారు.

sharmiala1.jpg

అప్లయిడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ సాధించిన కొడుకు రాజారెడ్డి, బీబీఏ ఫైనాన్స్ డిగ్రీ సాధించిన కూతురు అంజిలి రెడ్డికి ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌ వేదికగా షర్మిల పోస్టు పెట్టారు.

Untitled-6.jpg

చూస్తుండగానే చాలా ఎదిగిపోయారని, చాలా గర్వంగా ఉందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. సత్యాన్ని అన్వేషించాలని, సమగ్రతతో కూడిన జీవితాన్ని గడపాలని ఇద్దరికీ ఆమె సూచించారు. ‘‘ మీ సొంత విజయాన్ని సాధించే క్రమంలో మీ చుట్టూ ఉన్నవారికి విలువనివ్వడంతోపాటు వారి ఎదుగుదలకు కూడా తోడ్పడాలనే విషయన్ని గుర్తుంచుకోండి’’ అని పేర్కొన్నారు. జీవితంలో ఇద్దరూ అన్ని విధాలా బావుండాలని ఆశీర్వదించారు. కాగా తన పిల్లల గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి తల్లి విజయమ్మ, భర్త అనిల్‌తో కలిసి వెళ్లి హాజరైన ఫొటోలను ఫేస్‌బుక్ వేదికగా షర్మిల పంచుకున్నారు.

Updated Date - Dec 20 , 2023 | 01:54 PM