Sharmila నేడు వరంగల్‌లో షర్మిల పాదయాత్ర

ABN , First Publish Date - 2023-02-05T09:55:30+05:30 IST

వరంగల్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధినేత్రి షర్మిల (Sharmila) ఆదివారం వరంగల్ నగరంలో పాదయాత్ర (Padayatra) చేయనున్నారు.

Sharmila నేడు వరంగల్‌లో షర్మిల పాదయాత్ర

వరంగల్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధినేత్రి షర్మిల (Sharmila) ఆదివారం వరంగల్ నగరంలో పాదయాత్ర (Padayatra) చేయనున్నారు. రంగశాయిపేట మీదుగా నగరంలోకి షర్మిల పాదయాత్ర సాగనుంది. బట్టల బజార్, ములుగు రోడ్, హనుమకొండ చౌరస్తా, పబ్లిక్ గార్డెన్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా షర్మిల పలుచోట్ల మాటముచ్చట కార్యక్రమం నిర్వహించనున్నారు.

కాగా నిన్న (శనివారం) షర్మిల వరంగల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేతల (BRS Leaders)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. తమ కార్యకర్తలపై, మీడియాపై కూడా బీఆర్ఎస్ నేతలు దాడి చేశారన్నారు. నిజాలను చెబితే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అక్రమాలకు పాల్పడం లేదా, ఆయన ఏ1 కాంట్రాక్టర్ కాదా అని ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్‌నే కోడ్ చేసినట్లు తెలిపారు. ‘‘మీరు నిజాయితీపరులైతే పబ్లిక్ ఫోరం మీటింగ్ పెట్టండి... అక్కడ ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి’’ అంటూ సవాల్ విసిరారు. ప్రజల పక్షాన పోరాడటమే తమ తప్పా అంటూ నిలదీశారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తనపై దాడులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో హామీలు ఇచ్చి, ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని షర్మిల విమర్శించారు.

రైతులపై ఎమ్మెల్యే ఆరూరి రమేష్ థర్డ్ డిగ్రీ చేపించింది నిజం కాదా అని నిలదీశారు. కబ్జాలు చేయడం నిజం కాదా, ఏకంగా మందకృష్ణ భూమినే కబ్జా చేశారు కదా అని అన్నారు. ప్రజా సేవ చేయాలనే సోయి బీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదన్నారు. పర్వతగిరి నుంచి మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి ఆ గ్రామానికి ఏం చేశారని ప్రశ్నించానన్నారు. అప్పులపాలై సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఈ విషయంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. సర్పంచులకు నిధులు అందించాల్సింది పోయి ఖాళీ బీరు సీసాలు అమ్మమంటారా అని మండిపడ్డారు. ఎవరు మాట్లాడితే వాళ్లపై దాడులు, కేసులు పెడుతున్నారన్నారు. ‘‘బెదిరింపులకు, దాడులకు వైఎస్ షర్మిల భయపడదు. మీ దాడులకు రెట్టింపు స్థాయిలో మీ అవినీతిని ప్రశ్నిస్తాం. నిన్న జరిగిన దాడిపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీ లాంటి జేజమ్మలని ఎంతో మందిని చూశారు. బీఆర్ఎస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోండి’’ అంటూ హెచ్చరించారు. సెక్రటేరియట్‌లో ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసిన షర్మిల.. మాక్ డ్రిల్ జరిగితే ప్రతిపక్షాలను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు.

Updated Date - 2023-02-05T09:55:34+05:30 IST