TS NEWS: సర్పంచ్‌ని చెప్పుతో కొట్టిన యువకుడు.. పూర్తి వివరాలు ఇవే..

ABN , First Publish Date - 2023-05-31T18:24:01+05:30 IST

మహబూబాబాద్ (Mahbubabad) ఇటీవల కాలంలో రాజకీయ నాయకులపై (Politicians) భౌతికదాడులు ఎక్కువ అయ్యాయి.

TS NEWS: సర్పంచ్‌ని చెప్పుతో కొట్టిన యువకుడు.. పూర్తి వివరాలు ఇవే..

మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ (Mahbubabad) ఇటీవల కాలంలో రాజకీయ నాయకులపై (Politicians) భౌతికదాడులు ఎక్కువ అయ్యాయి. అభివృద్ధి, సంక్షేమాన్ని రాజకీయ నాయకులు విస్మరిస్తున్నారని, నేతలు తమ సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తూ నేతలపై స్థానికులు దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోని తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగున్నాయి.

మహబూబాబాద్ మండలం మోట్ల తండాలో సర్పంచ్‌ని ఓ యువకుడు చెప్పుతో కొట్టాడు. గ్రామసభలో అభివృద్ది పనుల నిధుల గోల్‌మాల్‌పై సర్పంచ్ బానోతు సుమన్ నాయక్‌ను ప్రశ్నించి దూషించి అంతటితో ఆగకుండా గ్రామస్థుడు వర్రే మహేష్ చెప్పుతో దాడి చేశాడు. గ్రామంలో అభివృద్ధి కుంటుపడి, మౌలిక సదుపాయాలు కరువయ్యాయని మహేష్ ఆరోపించారు. గ్రామంలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక, వ్యక్తిగత కక్షతోనే గిరిజనుడైన తనపై దాడి చేశారని సర్పంచ్ బానోతు సుమన్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-05-31T18:35:07+05:30 IST