KTR: గవర్నర్‌ వ్యవస్థపై మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-01-30T18:55:55+05:30 IST

గవర్నర్‌ (Governor) వ్యవస్థపై మంత్రి కేటీఆర్‌ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌ (Rajbhavan)లో ప్రధాని (PM) ఫొటోలు పెట్టుకున్నారని మంత్రి మండిపడ్డారు.

KTR: గవర్నర్‌ వ్యవస్థపై మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: గవర్నర్‌ (Governor) వ్యవస్థపై మంత్రి కేటీఆర్‌ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌ (Rajbhavan)లో ప్రధాని (PM) ఫొటోలు పెట్టుకున్నారని మంత్రి మండిపడ్డారు. రాజ్‌భవన్‌ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలన్నారు. గవర్నర్‌ వ్యవస్థ బ్రిటీష్‌ (British) వాళ్లు పెట్టింది.. ఇప్పుడు ఎందుకు? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. గవర్నర్‌ను ఎవరు ఎన్నుకున్నారని రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో రాజకీయాల్లో ఉన్నవారికి గవర్నర్‌ పదవి ఇవ్వొద్దని మోదీనే చెప్పారని గుర్తుచేశారు. బ్రిటిష్‌ కాలంలో ఉన్న రాజ్‌పధ్‌ను కర్తవ్యపధ్‌గా మార్చారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. బానిసత్వానికి చిహ్నాలుగా ఉన్న వాటిని తొలగించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

Updated Date - 2023-01-30T18:55:59+05:30 IST