Minister Prashanth Reddy : బీజేపీ వారే పేపర్ లీక్ చేసి.. వారే ధర్నాలు , రాస్తారోకోలు చేస్తున్నారు

ABN , First Publish Date - 2023-04-05T14:01:50+05:30 IST

పదవ తరగతి పేపర్ లీక్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సంబంధం ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Minister Prashanth Reddy : బీజేపీ వారే పేపర్ లీక్ చేసి.. వారే ధర్నాలు , రాస్తారోకోలు చేస్తున్నారు

నిజామాబాద్ : పదవ తరగతి పేపర్ లీక్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సంబంధం ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ వారే పేపర్ లీక్ చేసి వారే ప్రభుత్వానికి వైతిరేకంగా ధర్నాలు , రాస్తారోకోలు చేస్తున్నారన్నారు. బీజేపీ వారు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తే సహించేది లేదన్నారు. బీజేపీ నేతలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-04-05T14:02:01+05:30 IST