TS News: కిషన్‌రెడ్డికి మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్‌

ABN , First Publish Date - 2023-06-02T21:26:21+05:30 IST

తెలంగాణ అభివృద్ధితో గుజరాత్‌ రాష్ట్రాన్ని పోల్చిచూద్దామా? అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)కి మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) సవాల్‌ విసిరారు.

TS News: కిషన్‌రెడ్డికి మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్‌

సూర్యాపేట: తెలంగాణ అభివృద్ధితో గుజరాత్‌ రాష్ట్రాన్ని పోల్చిచూద్దామా? అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)కి మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) సవాల్‌ విసిరారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అంటూ గొప్పలు చెబుతున్న గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. 25సంవత్సరాలుగా బీజేపీ ఏలుబడిలో ఉన్న గుజరాత్‌ రాష్ట్రంలో అభివృద్ధి ఏమీలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో ఉనికి కోసమే బీజేపీ పాట్లు పడుతోందన్నారు. తెలంగాణలో తొమ్మిదేళ్లలో ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వలేకపోయారన్నారు. తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు కిషన్‌రెడ్డికి లేదన్నారు. నిజంగా తెలంగాణ (Telangana)పై బీజేపీ నాయకులకు ప్రేమ ఉంటే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా నిధులు తెస్తేనే విశ్వసనీయత పెరుగుతుందన్నారు. తెలంగాణ సమాజం మొత్తం సీఎం కేసీఆర్‌ వెంటే ఉందని జగదీష్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-06-02T21:26:21+05:30 IST