Share News

Kothagudem Dist,: సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

ABN , Publish Date - Dec 25 , 2023 | 11:25 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి హెడ్ కార్యాలయం వద్ద గుర్తింపు ఎన్నిక ప్రచారానికి ఎమ్మెల్యే సాంబశివరావు వచ్చారు. అయితే అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

Kothagudem Dist,: సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి హెడ్ కార్యాలయం వద్ద గుర్తింపు ఎన్నిక ప్రచారానికి ఎమ్మెల్యే సాంబశివరావు వచ్చారు. అయితే అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య వాగ్వాదం నెలకొని ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఏఐటీయూసీ అధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టి నినాదాలు చేశారు.

కాగా కొత్తగూడెం హెడ్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సాంబశివరావును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవటంపై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. సెక్యూరిటీ చీఫ్, సిబ్బందిపై సింగరేణి డైరెక్టర్ పా సీరియస్ అయ్యారు.

Updated Date - Dec 25 , 2023 | 11:25 AM