KCR: గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న హిమాన్షును ఆశీర్వదించిన కేసీఆర్ దంపతులు

ABN , First Publish Date - 2023-04-18T18:25:47+05:30 IST

గచ్చిబౌలీలో తన మనుమడు హిమాన్షు రావు (Himanshu Rao) చదువుతున్న ఓక్రిడ్జ్ ఇంటర్‌నేషనల్ స్కూల్ (Oakridge International School) వార్షికోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరయ్యారు

KCR: గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న హిమాన్షును ఆశీర్వదించిన కేసీఆర్ దంపతులు

హైదరాబాద్: గచ్చిబౌలీలో తన మనుమడు హిమాన్షు రావు (Himanshu Rao) చదువుతున్న ఓక్రిడ్జ్ ఇంటర్‌నేషనల్ స్కూల్ (Oakridge International School) వార్షికోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరయ్యారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని, 12 క్లాస్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న తమ మనుమడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు ఆశీర్వదించారు. మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలీలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12వ క్లాస్‌ను పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. ఈ సందర్భంగా తాను చదువుతున్న స్కూల్‌లో ‘12 క్లాస్ గ్రాడ్యుయేషన్ డే’ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత నాయనమ్మలైన కేసీఆర్, శోభమ్మ, తల్లిదండ్రులు కేటీఆర్ శైలిమలు, చెల్లెలు అలేఖ్య తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

kcr.jpg

గ్రాడ్యుయేషన్ డే’ సందర్భంగా 12వ తరగతిని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఓక్రిడ్జ్ స్కూలు యాజమాన్యం గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేసింది. విద్యనభ్యసిస్తూనే క్రీడసాంస్కృతిక రంగం, సామాజిక సేవ తదితర రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ప్రతిభా పురస్కారాలను అందజేసింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు ‘కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్’ (సిఎఎస్) విభాగంలో గొప్ప ప్రతిభను ప్రదర్శించినందుకు గాను వారి ప్రతిభను గుర్తించి, హిమాన్షును సిఎఎస్ విభాగంలో ఎక్స్ లెన్స్ అవార్డును అందజేశారు.

ktr.jpg

గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాన్షు వెంటనే స్టేజీ దిగివచ్చి తమ తాత సీఎం కేసీఆర్ చేతుల్లో గ్రాడ్యుయేషన్ పట్టాను పెట్టి పాదాలకు నమస్కరించారు. తాతగారి దీవెనలను తీసుకున్నారు. చిన్నతనం నుంచీ తనచేతుల్లో పెరిగి నేడు పట్టబధ్రుడుగా ఎదిగిన మనుమన్ని హృదయపూర్వకంగా అభినందించారు సీఎం కేసీఆర్. తాను చదువుకున్న పాఠశాల వారు శిక్షణలో భాగంగా అప్పగించిన సామాజిక సేవ అంశాన్ని సవాలుగా తీసుకుని, ఆ విభాగానికి అధ్యక్షత వహిస్తూ సామాజిక సేవలో గొప్పగా ప్రతిభ కనబరిచి అందులో ఎక్స్ లెన్సీ అవార్డును పొందినందుకు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తన మనుమడు హిమాన్షు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనుమడిని సీఎం ఆశీర్వదించారు.

kcr1.jpg

గ్రాడ్యుయేషన్ పట్టాలనందుకుంటున్న సహచర విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన హిమాన్షు తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు తమ కుమారుడు పెరిగి పెద్దవాడై సాధించిన ప్రతిభానైపుణ్యాల చూసి పుత్రోత్సాహంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హిమాన్షు అమ్మమ్మ, మేనమామలు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హిమాన్షు రావుతో పాటు గ్రాడ్యుయేషన్ పట్టాను పొందిన క్లాస్ మేట్ ఆద్విత్ బిగాల తండ్రి, బిఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, వారి పెదనాన్న ఎమ్మెల్యే గణేష్ బిగాల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రాడ్యుయేషన్ డే సంద్భంగా పట్టాలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో సమావేశ మందిరం కిక్కిరిసింది. విద్యార్థుల హర్షధ్వానాలతో ప్రాంగణం మారు మోగింది.

Updated Date - 2023-04-18T18:31:43+05:30 IST