Vijayashanthi : ‘గులాబీ’ నేతలు గుబులెక్కి శివాలెత్తిపోతున్నరు

ABN , First Publish Date - 2023-05-23T11:59:26+05:30 IST

రిజర్వ్ బ్యాంక్ 2 వేల రూపాయల నోటును రద్దు చేసిన తదినంతర పరిణామాలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ 2 వేల రూపాయల నోటును చెలామణీ నుంచి ఉపసంహరించుకోవడంతో కొన్ని వర్గాలు మళ్లీ గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాయని చెబుతూ ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ పెట్టారు. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు జరిగినప్పుడే కేవలం తాత్కాలిక సర్దుబాటుగా మాత్రమే రూ.2000 నోటును ప్రవేశపెడుతున్నామని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా చెప్పిందన్నారు.

Vijayashanthi : ‘గులాబీ’ నేతలు గుబులెక్కి శివాలెత్తిపోతున్నరు

హైదరాబాద్ : రిజర్వ్ బ్యాంక్ 2 వేల రూపాయల నోటును రద్దు చేసిన తదినంతర పరిణామాలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ 2 వేల రూపాయల నోటును చెలామణీ నుంచి ఉపసంహరించుకోవడంతో కొన్ని వర్గాలు మళ్లీ గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాయని చెబుతూ ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ పెట్టారు. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు జరిగినప్పుడే కేవలం తాత్కాలిక సర్దుబాటుగా మాత్రమే రూ.2000 నోటును ప్రవేశపెడుతున్నామని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా చెప్పిందన్నారు. ప్రస్తుతం అదీగాక కొద్దో గొప్పో నోట్లు ఉన్నవాళ్లు మార్చుకోవడానికి 4 నెలల సమయం కూడా ఇచ్చిందని విజయశాంతి పేర్కొన్నారు. అందువల్ల ఈ నిర్ణయంతో సామాన్యులకి కలిగిన నష్టం ఏమీ లేకున్నా... ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఆ వర్గాలు వ్యతిరేక ప్రచారానికి దిగాయన్నారు.

ఇంకా రాములమ్మ మాట్లాడుతూ.. ‘‘2016లో నోట్ల రద్దు జరిగినప్పుడు ఎన్ని నోట్లు మురికికాల్వల్లో కనిపించాయో... ఎంత నల్లధనం అగ్నికి ఆహుతైందో చెప్పాల్సిన పని లేదు. ఇతర రాజకీయ పార్టీల్ని దెబ్బకొట్టడానికే ఈ నిర్ణయం జరిగిందని కొందరు అంటున్నారు. అదే నిజమైతే కర్ణాటక ఎన్నికలకి ముందే ఈ నిర్ణయం వెలువడి ఉండేది. నిజానికి ‘గులాబీ’ నోటు రద్దుతో గుండెలు బాదుకుంటున్నవాళ్లు ఎవరైనా ఉంటే అది తెలంగాణలోని అధికార ‘గులాబీ’ దళం తప్ప ఇంకెవరూ అయి ఉండరు. రాష్ట్రంలో పెచ్చురిల్లిన అవినీతి, అక్రమార్జన తీరుని గమనిస్తే అధికారగణం దగ్గర తప్ప ఇంకెక్కడా ఈ 2 వేల నోట్ల కుప్పలు భారీగా కనిపించే పరిస్థితి లేదు. అందుకే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేకపోయినా ‘గులాబీ’ నేతలు మాత్రం గుబులెక్కి శివాలెత్తిపోతున్నరు. లక్షల కోట్ల 2 వేల రూపాయల నోట్లు ‘గులాబీ’ రంగే కదా! బీఆర్ఎస్ పేర దేశమంతా తోరణాలు కట్టుకోర్రి, నోట్ల రద్దే లేకుంటే ఈ దోపిడీ నోట్ల పంపిణీ దేశమంతా జరిపించేవారు మీరు, రాజ్‌దీప్ సర్దేశాయ్ అనే జర్నలిస్ట్ బయటకు చెప్పిన నిజాల ప్రకారం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-05-23T11:59:26+05:30 IST