Tamilisai: ఆర్టీసీ విలీనం బిల్లుపై సంతకానికి మరింత సమయం కావాలి..

ABN , First Publish Date - 2023-08-04T14:53:27+05:30 IST

హైదరాబాద్: ఆర్టీసీ (RTC) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై సంతకం చేసేందుకు మరింత సమయం కావాలని గవర్నర్ తమిళి సై అన్నారు. న్యాయ పరమైన అంశాలు పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ పేర్కొంటూ ఈ మేరకు మీడియా నోట్ విడుదల చేశారు.

Tamilisai: ఆర్టీసీ విలీనం బిల్లుపై సంతకానికి మరింత సమయం కావాలి..

హైదరాబాద్: ఆర్టీసీ (RTC) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై సంతకం చేసేందుకు మరింత సమయం కావాలని గవర్నర్ తమిళిసై (Governor Tamilsai) అన్నారు. న్యాయ పరమైన అంశాలు పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ పేర్కొంటూ ఈ మేరకు మీడియా నోట్ విడుదల (Media Note Release) చేశారు. ఆర్టీసీ ముసాయిదా బిల్లు 2వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరింది... బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం రాజ్‌భవన్‌కు పంపింది.

కాగా రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం (TSRTC Merge) చేయాలనుకున్న కేసీఆర్ సర్కార్‌కు (KCR Govt) అనూహ్య పరిణామం ఎదురైంది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే (Assembly Session) ఆర్టీసీ బిల్లుని (RTC Bill) ప్రవేశపెట్టాలనుకున్న బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్‌ ఆమోదం కోసం ప్రభుత్వం బిల్లుని పంపించగా.. ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం లభించలేదు.

Updated Date - 2023-08-04T14:53:27+05:30 IST