Share News

Hyderabad: కిషన్‌రెడ్డికి తలనొప్పిగా మారిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం

ABN , First Publish Date - 2023-10-29T10:20:30+05:30 IST

హైదరాబాద్: కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో ఖైరతాబాద్‌కు మాత్రమే అభ్యర్థిని ప్రకటించారు. మిగిలిన ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక తల నొప్పిగా మారడంతో తర్జన భర్జన పడుతున్నారు.

Hyderabad: కిషన్‌రెడ్డికి తలనొప్పిగా మారిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం

హైదరాబాద్: కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో ఖైరతాబాద్‌కు మాత్రమే అభ్యర్థిని ప్రకటించారు. మిగిలిన ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక తల నొప్పిగా మారడంతో తర్జన భర్జన పడుతున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో మూడు సీట్లు బీసీలకు ఇవ్వల్సిందేనని ఆశావాహులు అంటున్నారు. సికింద్రాబాద్ టికెట్‌ను మేకల సారంగపాణి, బండా కార్తీకరెడ్డి ఆశిస్తున్నారు.

జూబ్లీహిల్స్ నుంచి డాక్టర్ పద్మ వీరపనేని, లంకల దీపక్ రెడ్డి; అలాగే మర్రి శశిధర్ రెడ్డి, ఆకుల విజయ సనత్నగర్ టికెట్ ఆశిస్తున్నారు. ముషిరాబాద్ టికెట్ కోసం బండారు విజయలక్ష్మీ, విక్రమ్ గౌడ్, గోపాల్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. అంబరుపేట టికెట్ రేసులో గౌతంరావు, కృష్ణాయాదవ్, ప్రకాష్ రెడ్డిలు నాంపల్లి సీటును సీనియర్ నేత రాములకు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బూబ్లీహిల్స్, ముషీరాబాద్, అంబరుపేట.. ఏదొక స్థానాన్ని విక్రమ్ గౌడ్ ఆశిస్తున్నారు. అయితే విక్రమ్ గౌడ్‌కు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏదొక స్థానాన్ని కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

Updated Date - 2023-10-29T10:20:30+05:30 IST