Hyderabad: సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో సంచలన విషయాలు..

ABN , First Publish Date - 2023-04-21T14:23:53+05:30 IST

హైదరాబాద్: సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడిని అత్యంత దారుణంగా హింసించి దుండగులు చంపారు.

Hyderabad: సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో సంచలన విషయాలు..

హైదరాబాద్: సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడిని అత్యంత దారుణంగా హింసించి దుండగులు చంపారు. ఇమ్రాన్ అనే ట్రాన్స్ జెండర్ బాలుడిని గొంతు నులిమి చంపి... ఆపై కరెంట్ వైర్‌తో మెడకు బిగించింది... కాళ్ళు చేతులు వైర్‌తో కట్టి... ఎముకలు విరిచి.. బకెట్‌లో కుక్కింది. మజీద్ నుంచి ఇంటికి వస్తున్న అబ్దుల్ వహీద్‌ను తన ఇంట్లోకి పిలిచిన ఇమ్రాన్.. ఓఆర్ఎస్ (ORS) తీసుకురమ్మని చెప్పింది. ఓఆర్ఎస్ తీసుకుని ఇంటికి వచ్చిన బాలుడిని లోపల వేసి గడియపెట్టి హత్య చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ఇమ్రాన్, ఆటో డ్రైవర్ ఆలీతో సహా... మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన కొడుకు హత్యలో ఇమ్రాన్‌కి ఆమె బంధువులు.. సలీం, జహంగీర్, ఇంతియాజ్, అర్బాజ్, షబానా సహకరించారని వహీద్ తండ్రి వసీం ఫిర్యాదులో పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే.. నిన్న సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటి వచ్చిన అబ్దుల్ వహీద్ అనే బాలుడు నమాజ్ చేసేందుకు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఇమ్రాన్ అనే హిజ్రా పిలవడంతో బాలుడు ఆమెతో కలిసి వెళ్లాడు. వీరిద్దరు కలిసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే కాసేపటికే బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి వెతికినప్పటికీ బాలుడి ఆచూకి లభించలేదు. ఇదిలా ఉండగా రాత్రి సమయంలో ఓ చోట క్షుద్రపూజలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, స్థానికులు అక్కడకు వెళ్లి చూడగా పూజలు జరిగినట్లు గుర్తించారు. నిన్న చాలా అరుదైన అమవాస్య కావడంతోనే ఈ పూజలు జరిగినట్లు గుర్తించారు. అనుమానంతో బాలుడి కోసం తీవ్రంగా గాలించగా... పక్కనే ఉన్న నాలాలో బాలుడి మృతదేహం లభించింది.

అయితే అప్పటికే హిజ్రా ఇమ్రాన్ పరారీలో ఉంది. దీంతో బాలుడి మృతికి ఆమెనే కారణమంటూ హిజ్రా ఇంటిపై స్థానికులు దాడి చేసి ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనతో అల్లాదున్ కోటి ఏరియా ప్రాంతంలో రాత్రంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెల్లవారితే రంజాన్ పండుగ జరుపుకోనున్న సమయంలో బాలుడు ఈ విధంగా చనిపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఒక్కడేనా ఇంకెవరైనా సహాయం చేశారా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా అబ్దుల్ వాహీద్ అనే బాలుడి నరబలి అంటూ వచ్చిన వార్తలపై డీసీపీ శ్రీనివాసరావు స్పందించారు. బాలుడు మిస్ అవగానే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గాలింపు మొదలుపెట్టామని, బాలుడిని చంపేసినట్లు గుర్తించామని వెల్లడించారు. ఇమ్రాన్ అనే ట్రాన్స్ జెండర్ బాలుడిని మర్డర్ చేసి ఆటో డ్రైవర్ సహాయంతో నాలాలో పడేశాడన్నారు. అబ్దుల్ వాహీద్‌ని నరబలి కాదని.. ఫైనాన్షియల్ గొడవల వల్ల మర్డర్ జరిగిందని డీసీపీ వెల్లడించారు. చిన్నారి డెడ్ బాడీని నాలాలో గుర్తించామన్నారు. బాలుడు ఇమ్రాన్ ఇంటికి ఆడుకోవడానికి వెళ్లాడన్నారు. సదరు ట్రాన్స్ జెండర్.. ఇంట్లో బాలుడిని చంపేసి బకెట్‌లో డెడ్ బాడీని పెట్టి.. గోనె సంచిలో నాలాకి తీసుకెళ్లిందని డీసీపీ శ్రీనివాసరావు వివరించారు.

Updated Date - 2023-04-21T14:31:03+05:30 IST