Revanth Reddy: పేపర్ లీక్‌లోమంత్రి కేటీఆర్ శాఖ ఉద్యోగులదే కీలకపాత్ర..

ABN , First Publish Date - 2023-03-22T14:51:07+05:30 IST

హైదరాబాద్: టీఏస్‌పీఏస్సీ పేపర్ లీక్ (TSPSC Paper Leak) లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.

Revanth Reddy: పేపర్ లీక్‌లోమంత్రి కేటీఆర్ శాఖ ఉద్యోగులదే కీలకపాత్ర..

హైదరాబాద్: టీఏస్‌పీఏస్సీ పేపర్ లీక్ (TSPSC Paper Leak) లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. బుధవారం గవర్నర్ తమిళిసై (Governor Tamilisai)ని టీ.కాంగ్రెస్ నేతలు (T.Congress Leaders) కలిసారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఏస్‌పీఏస్సీ పేపర్ లీక్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసామన్నారు. పేపర్ లీక్‌లో మంత్రి కేటీఆర్ (Minister KTR) శాఖ ఉద్యోగులదే కీలకపాత్రని ఆరోపించారు. కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్‌కు అప్లికేషన్ పెట్టామన్నారు. వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చామన్నారు.

ఇప్పుడున్న టీఏస్‌పీఏస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అందరినీ సస్పెండ్ చేసి.. పారదర్శక విచారణ చేస్తారని భావించాం.. కానీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేసే విశేష అధికారం గవర్నర్‌కు ఉందన్నారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారని విమర్శించారు. కేటీఆర్, జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు అప్లికేషన్ ఇచ్చామన్నారు. దీనిపై లీగల్ ఓపినీయన్ తీసుకుని నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-03-22T14:51:07+05:30 IST