Marri Shasidhar Reddy: సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేయాలి

ABN , First Publish Date - 2023-10-09T16:14:52+05:30 IST

సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేయాలని బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి(Marri Shasidhar Reddy) వ్యాఖ్యానించారు.

Marri Shasidhar Reddy: సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేయాలి

హైదరాబాద్: సీఎం కేసీఆర్(CM KCR) ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేయాలని బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి(Marri Shasidhar Reddy) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘సీఎం కేసీఆర్‌పై కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉంది. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని మంత్రి కేటీఆర్ తన తండ్రి కేసీఆర్‌ను ఒత్తిడి చేస్తున్నారు. తమ‌ ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి తెలుసుకునే హక్కు ప్రజలకుంది. సీక్రెట్‌గా ఉంచడం వల్ల కాన్షీరాం, జయలలిత ఆరోగ్యం ఏమైందో అందరికీ తెలుసు. కాన్షీరాం, జయలలిత మరణాలపై పలు అనుమానాలున్నాయి. సీఎం కేసీఆర్ ఆరోగ్యం బులిటెన్ విడుదల చేసేలా సీఎస్‌కు ఆదేశాలివ్వాలని గవర్నర్‌కు లేఖ రాశాను’’ అని మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-09T16:14:52+05:30 IST