Share News

ఇలాంటి దిగ్బ్రాంతికరమైన వార్త వినాల్సి వస్తుందనుకోలేదు: కుంజా సత్యవతి మృతిపై కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2023-10-16T10:06:36+05:30 IST

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు శ్రీమతి కుంజా సత్యవతి హఠాన్మరణం పట్ల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి.కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు.

ఇలాంటి దిగ్బ్రాంతికరమైన వార్త వినాల్సి వస్తుందనుకోలేదు: కుంజా సత్యవతి మృతిపై కిషన్ రెడ్డి

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు శ్రీమతి కుంజా సత్యవతి హఠాన్మరణం పట్ల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి.కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. 2009-14లో అసెంబ్లీలో సత్యవతితో కలిసి పనిచేశానన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎప్పుడూ తపనపడే సత్యవతి.. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రజాసంక్షేమం విషయంలో తన వాణిని బలంగా వినిపించేవారని కిషన్ రెడ్డి అన్నారు.

ములుగులో గిరిజన సెంట్రల్ యూనివర్సిటీని మోదీ ప్రకటించిన సందర్భంగా.. వారం రోజుల క్రితం మేడారంలో అమ్మవారిని దర్శించుకునన్నారు. ఈ సందర్బంగా వారందరి తరపున మోదీకి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా శ్రీమతి సత్యవతి రాథోడ్ గారితో మాట్లాడానన్నారు. ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనితీరును ఆమె వివరించారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇంతలోనే.. ఇలాంటి దిగ్బ్రాంతికరమైన వార్త వినాల్సి వస్తుందనుకోలేదన్నారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు కిషన్‌రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Updated Date - 2023-10-16T10:06:36+05:30 IST