Kishan Reddy: సీఎం కేసీఆర్‌పై మండిపడ్డ కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-05-25T13:08:07+05:30 IST

మోదీని గద్దె దించడానికి ఎంత డబ్బు అయిన ఖర్చు చేస్తానని కేసీఆర్ అంటున్నారని.. ఆ డబ్బు

Kishan Reddy: సీఎం కేసీఆర్‌పై మండిపడ్డ కిషన్‌రెడ్డి
Kishan Reddy

సికింద్రాబాద్: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. క్లాసిక్ గార్డెన్స్‌లో బీజేపీ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై (CM KCR) మండిపడ్డారు. మోదీని గద్దె దించడానికి ఎంత డబ్బు అయిన ఖర్చు చేస్తానని కేసీఆర్ అంటున్నారని.. ఆ డబ్బు ఎవరిదో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. దళిత ముఖ్యమంత్రి, దళితబంధు ఎక్కడా? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం చేయని అవినీతి లేదన్నారు. తెలంగాణలో కమలం పువ్వు జెండా ఎగరడం ఖాయమని జోస్యం చెప్పారు. కర్ణాటకలో ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ మూడు రోజుల సమయం తీసుకుందని ఎద్దేవా చేశారు. వీళ్లు దేశంలో అన్ని పార్టీలతో కలిసి కేంద్రంలో అధికారంలోకి వస్తారట!. దేశంలో ఎవరు అధికారంలోకి వచ్చినా మూడు నెలల కంటే ఎక్కువ పాలించలేవని పేర్కొన్నారు. బీజేపీ మాత్రమే సమర్థవంతమైన పాలన అందిస్తుందని స్పష్టం చేశారు. మోదీ ఏ దేశానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కిషన్‌రెడ్డి వివరించారు.

Updated Date - 2023-05-25T13:21:28+05:30 IST