Share News

Tamilisai: ప్రవళిక మ‌ృతిపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశం

ABN , First Publish Date - 2023-10-14T16:17:30+05:30 IST

గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై దిగ్ర్భాంత్రి వ్యక్తం చేశారు. ప్రవళిక మ‌ృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశించారు.

Tamilisai: ప్రవళిక మ‌ృతిపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశం

హైదరాబాద్‌: గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై దిగ్ర్భాంత్రి వ్యక్తం చేశారు. ప్రవళిక మ‌ృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశించారు. నిరుద్యోగ యువతి, యువకులు అధైర్య పడొద్దని గవర్నర్ కోరారు. అశోక్‌నగర్‌లోని ఓ హోస్టల్‌లో ఉంటూ ప్రవళిక పోటీ పరీక్షలకు సిద్ధపడుతోంది. శుక్రవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ప్రవళిక ఆత్మహత్య తర్వాత పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-10-14T16:17:30+05:30 IST