లైఫ్ జాకెట్లతో జీహెచ్‌ఎంసీ సమావేశానికి కార్పొరేటర్లు.. అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2023-05-03T12:32:31+05:30 IST

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్తున్న బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. దోమ వేషధారణలో ఉన్న మల్కాజ్ గిరి కార్పొరేటర్‌తో పాటు లైఫ్ జాకెట్లు వేసుకున్న కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు.

లైఫ్ జాకెట్లతో జీహెచ్‌ఎంసీ సమావేశానికి కార్పొరేటర్లు.. అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్తున్న బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. దోమ వేషధారణలో ఉన్న మల్కాజ్ గిరి కార్పొరేటర్‌తో పాటు లైఫ్ జాకెట్లు వేసుకున్న కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. లైఫ్ జాకెట్లు తొలగించి కౌన్సిల్ హాల్ లోపలికి వెళ్లాలంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులకు, బీజెపీ కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

చిన్న వర్షానికే అతలాకుతలమవుతున్న హైదరాబాద్ నగర ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు కాబట్టి ఈరోజు జరగనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ కి వెళ్తూ ఉండగా తన కుటుంబ సభ్యులు తన భద్రత గురించి లైఫ్ జాకెట్, స్విమ్మింగ్ ట్యూబ్ తదితర వస్తువులు ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి తిరిగి రమ్మని పంపించారని సరూర్‌నగర్‌ కార్పోరేటర్ ఆకుల శ్రీవాణి మీడియాకు తెలిపారు.

‘‘మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు ఇకనైనా మీ మొద్దు నిద్ర వదిలి హైదరాబాదులోని పెండింగ్ నాలా పనులు.. డ్రైనేజీ వ్యవస్థ తక్షణమే సరిదిద్ది ప్రజలకు రక్షణ కల్పించండి. లేదంటే రానున్న రోజులలో మీరే ప్రతి ఇంటికి ఇవి ఇవ్వాల్సి వస్తుంది. జీహెచ్ఎంసీ ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతుంది కానీ పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి కోట్ల రూపాయల ప్రజాధనం ఎక్కడికి పోతుంది?’’ అని ఆకుల శ్రీవాణి ప్రశ్నించారు.

Updated Date - 2023-05-03T12:32:31+05:30 IST