Tarun Chugh: అధికారం చేజారిపోతోందన్న ఆందోళన కేసీఆర్‌లో కనిపిస్తోంది..

ABN , First Publish Date - 2023-01-15T12:48:28+05:30 IST

ఢిల్లీ: తెలంగాణలో అధికారం చేజారిపోతోందన్న ఆందోళన సీఎం కేసీఆర్‌లో కనిపిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ అన్నారు.

Tarun Chugh: అధికారం చేజారిపోతోందన్న ఆందోళన కేసీఆర్‌లో కనిపిస్తోంది..

ఢిల్లీ (Delhi): తెలంగాణ (Telangana)లో అధికారం చేజారిపోతోందన్న ఆందోళన సీఎం కేసీఆర్‌ (CM KCR)లో కనిపిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ (Tarun Chugh) అన్నారు. సీఎం కేసీఆర్ చేసిన తాలిబాన్ కామెంట్ల (Taliban comments)పై స్పందించిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తాలిబాన్లు అంటే ప్రభుత్వ వాహనంలో బాలికపై అత్యాచారం చేసినవాళ్లు.. తాలిబాన్లు అంటే అత్యాచారం చేసిన వాహనాన్ని నడిపిన అధికార పార్టీ నేతల పిల్లలు.. అత్యాచార ఘటనలో ఉన్న టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల నేతలు తాలిబాన్లు.. దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయనివాళ్లు తాలిబాన్లు.. డబుల్ బెడ్రూం ఇళ్లను ఇవ్వనివాళ్లు, పేదల రక్తం పీల్చుకునేవాళ్లు తాలిబాన్లు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-01-15T12:48:33+05:30 IST