Share News

Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా 29న గచ్చిబౌలి మైదానంలో ప్రత్యేక కార్యక్రమం

ABN , First Publish Date - 2023-10-25T14:02:31+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) మద్దతుగా ఐటీ ఉద్యోగులు మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైదరాబాద్‌లోని

Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా 29న గచ్చిబౌలి మైదానంలో ప్రత్యేక కార్యక్రమం

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) మద్దతుగా ఐటీ ఉద్యోగులు మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఐటీ అభివృద్ధికి గుర్తుగా మాదాపూర్‌లో సైబర్ టవర్స్‌ నిర్మించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబరు 29న గచ్చిబౌలి మైదానంలో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు ఐటీ ఉద్యోగులు తెలిపారు.

ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన iamwithcbn.co వెబ్‌సైట్‌ను ఐటీ ఉద్యోగులు ఆవిష్కరించారు. చంద్రబాబుపై కృతజ్ఞత చూపించే ఐటీ ఉద్యోగులు, వివిధ రంగాల్లో స్థిరపడిన అభిమానులంతా వెబ్‌సైట్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గచ్చిబౌలిలో నిర్వహించే కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని పిలుపు నిచ్చారు.

WhatsApp Image 2023-10-25 at 1.02.16 PM.jpeg

Updated Date - 2023-10-25T14:05:01+05:30 IST