Naveen case: నవీన్ హత్య కేసులో కీలక పరిణామం.. హరిహర ప్రియురాలు నిహారిక అరెస్ట్

ABN , First Publish Date - 2023-03-06T19:03:08+05:30 IST

అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో (Naveen Murder case కీలక పరిణామం చోటుచేసుకుంది...

Naveen case: నవీన్ హత్య కేసులో కీలక పరిణామం.. హరిహర ప్రియురాలు నిహారిక అరెస్ట్

హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో (Naveen Murder case) కీలక పరిణామం చోటుచేసుకుంది. హంతకుడు హరిహరకృష్ణ (HariHara Krishna) ప్రియురాలు నిహారిక రెడ్డితోపాటు (Niharika Reddy) స్నేహితుడు హాసన్‌ (Hasan) పేర్లను పోలీసులు ఈ కేసులో చేర్చారు. నిహారికను ఏ3గా, హాసన్‌ను ఏ2గా పేర్కొన్నారు. వీరిద్దరిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. హరిహరకృష్ణ ఏ1 ఉన్నాడని తెలిపారు.

కాగా ఈ కేసులో కొత్త అంశాలను పోలీసులు గుర్తించారు. హరిహర, హాసన్, నిహారిక ముగ్గురు కలిసి నవీన్ హత్య జరిగిన ఘటనాస్థలికి వెళ్లారు. ముగ్గురూ ఆ ప్రాంతాన్ని చూశారు. ఇక హత్య జరిగిన తర్వాత హరిహరకు నిహారిక రూ.1500 మనీ ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ తర్వాత ఫోన్‌ కాల్స్‌, ఫొటోలకు సంబంధించిన డేటాను డిలీట్ చేసింది. ఎవిడెన్స్ టాంపరింగ్‌కు పాల్పడిందని పోలీసులు తెలిపారు. కాగా హాసన్‌కు కూడా హత్య విషయం తెలిసినా పోలీసులకు చెప్పలేదని పోలీసులు వివరించారు. అందుకే వీరిద్దరిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. హాసన్‌కు నవీన్ హత్య గురించి తెలిసినా కూడా పోలీసులకు చెప్పలేదని తెలిపారు. ఇప్పటికే హరిహరను పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు. ప్రేమ వ్యవహారమే నవీన్ హత్యకు కారణమని మరోసారి చెప్పారు.

కాగా నవీన్‌ను అత్యంత దారుణంగా హత్య చేసిన హరిహరకృష్ణ.. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కోశాడు. గుండె, ఇతర శరీర భాగాలను సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి వాటిని ప్రేయసి నిహారికకు పంపించిన విషయం తెలిసిందే.

అసలు కథ ఇదీ...

నవీన్ హత్య కేసులో ముఖ్యమైన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నల్గొండ ఎంజీ యూనివర్శిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్‌‌కు.. అదే కళాశాలలో చదువుతున్న హరిహరకృష్ణతో మంచి స్నేహం ఏర్పడింది. అయితే వీరిద్దరు ఒకే అమ్మాయి నిహారిక రెడ్డిని ప్రేమించారు. విషయం తెలుసుకుని ఇరువురు కొద్దిరోజులుగా గొడవలు పడ్డారు. ఈ క్రమంలో తాను ప్రేమించిన యువతి కోసం స్నేహితుడిని తప్పించాలని హరిహరకృష్ణ ప్లాన్ చేశాడు. ఫిబ్రవరి 17న పార్టీ చేసుకుందామని పిలిచి.. మద్యం తాగిన తర్వాత నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. ఆపై అత్యంత కిరాతంగా నవీన్‌ తల, మొండెం వేరు చేశాడు. గుండెను బయటకు తీసి, మర్మాంగాలు కోసేశాడు. పేగుల బయటకు తీసి సైకోలా ప్రవర్తించాడు. ఆపై అక్కడి నుంచి తండ్రి వద్దకు వెళ్లిన హరిహరకృష్ణ హత్య గురించి చెప్పాడు. చివరకు తండ్రి సూచన మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల వద్ద హరిహరకృష్ణ లొంగిపోయాడు.

Updated Date - 2023-03-06T19:47:45+05:30 IST