Chikoti Praveen: మూడు గంటలుగా చికోటిని విచారిస్తున్న ఈడీ

ABN , First Publish Date - 2023-05-15T17:30:54+05:30 IST

క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌ (Chikoti Praveen) ఈడీ విచారణ కొనసాగుతోంది. థాయిలాండ్ (Thailand) గ్యాంబ్లింగ్ కేసులో కోట్ల రూపాయల లావాదేవీలపై ప్రవీణ్‌ను ఈడీ..

Chikoti Praveen: మూడు గంటలుగా చికోటిని విచారిస్తున్న ఈడీ

హైదరాబాద్: క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌ (Chikoti Praveen) ఈడీ విచారణ కొనసాగుతోంది. థాయిలాండ్ (Thailand) గ్యాంబ్లింగ్ కేసులో కోట్ల రూపాయల లావాదేవీలపై ప్రవీణ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం తన లాయర్లతో కలిసి ప్రవీణ్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మూడు గంటలుగా చికోటి ప్రవీణ్ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. విదేశీ డబ్బును కాయిన్స్ రూపంలో మార్పిడి.. బ్యాంక్ ఖాతాలపై ఈడీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. థాయ్లాండ్ కేసులో మనీలాండరింగ్.. అనూమనిత ఖాతాలు.. నగదు మార్పిడిపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాసినో కేసు (Casino case)లో గతంలోనూ చికోటిని ఈడీ విచారించింది. విదేశాల్లో నిర్వహించిన క్యాసినో ఈవెంట్స్‌లో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ప్రవీణ్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. అయితే థాయిలాండ్‌లో గ్యాంబ్లింగ్ ఆడుతూ దొరికిన తర్వాత మరోసారి ఈడీ నోటీసులిచ్చింది. థాయిలాండ్‌లో క్యాసినో నిర్వహిస్తుండగా చికోటి ప్రవీణ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదు లావాదేవీలపై చికోటి ప్రవీణ్‌ను ఈడీ ప్రశ్నించనుంది. చికోటి ప్రవీణ్‌తో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సంపత్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులిచ్చింది. ట్రావెల్ ఏజెంట్ సంపత్ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరయ్యారు.

Updated Date - 2023-05-15T17:31:00+05:30 IST