Share News

DK Shivakumar: కేసీఆర్‌.. దమ్ముంటే కర్ణాటకకు రా..! గ్యారెంటీల అమలును చూపిస్తా..

ABN , First Publish Date - 2023-11-26T10:35:34+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌.. దమ్ముంటే కర్ణాటకకు రా, ఐదు గ్యారెంటీల అమలును నిరూపిస్తానని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

DK Shivakumar: కేసీఆర్‌.. దమ్ముంటే కర్ణాటకకు రా..! గ్యారెంటీల అమలును చూపిస్తా..

- కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

చిక్కడపల్లి(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌.. దమ్ముంటే కర్ణాటకకు రా, ఐదు గ్యారెంటీల అమలును నిరూపిస్తానని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(DK Shivakumar) సవాల్‌ విసిరారు. ముషీరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎం. అంజన్‌కుమార్‌ యాదవ్‌కు మద్దతుగా గాంధీనగర్‌ డివిజన్‌ సబర్మతినగర్‌లో శనివారం రాత్రి జరిగిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలు చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్న కేసీఆర్‌, కేటీఆర్‌లు తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో 6 గ్యారెంటీ ల అమలును కచ్చితంగా చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. రెండుసార్లు పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించిన అంజన్‌కుమార్‌యాదవ్‌ శాసనసభ్యుడుగా మీకు సేవలందించడానికి వచ్చారన్నారు. ఆయనను ఆశీర్వదిస్తే రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలకబాధ్యతలు చేపడతారని వెల్లడించారు. సభలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎం. అంజన్‌కుమార్‌యాదవ్‌, టీపీసీసీ వర్కింగ్‌ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌, తెలంగాణ జనసమితి గ్రేటర్‌ అధ్యక్షుడు ఎం.నరసయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-11-26T10:35:36+05:30 IST