Share News

Revanth Reddy: బస్ టికెట్ తీసుకుని ప్రయాణం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-12-09T17:25:09+05:30 IST

తెలంగాణలో నూతనంగా ఏర్పడిన రేవంత్‌రెడ్డి సర్కార్ హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా రెండు స్కీమ్‌ల అమలుకు సోనియాగాంధీ బర్త్ డే సందర్భంగా

Revanth Reddy: బస్ టికెట్ తీసుకుని ప్రయాణం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో నూతనంగా ఏర్పడిన రేవంత్‌రెడ్డి సర్కార్ హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా రెండు స్కీమ్‌ల అమలుకు సోనియాగాంధీ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం అమల్లోకి తీసుకొచ్చింది. ఒకటి మహాలక్ష్మీ పథకం కింది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ సర్వీస్‌ను అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్సులో ముఖ్యమంత్రి రేవంత్ ప్రయాణం చేశారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు బస్సులో ప్రయాణం చేశారు. తిరిగి వెళ్తూ రేవంత్ ‌రెడ్డి టికెట్ తీసుకున్నారు. 10 రూపాయల బస్ టికెట్ తీసుకున్నారు.

అలాగే ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10లక్షల పెంచుతూ రెండో పథకాన్ని రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-09T17:25:10+05:30 IST