Share News

BJP: మునుగోడు నియోజకవర్గంపై బీజేపీ ఫోకస్

ABN , First Publish Date - 2023-10-28T17:59:03+05:30 IST

మునుగోడు నియోజకవర్గంపై బీజేపీ (BJP ) ఫోకస్ పెట్టింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజాగోపాలరెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

BJP: మునుగోడు నియోజకవర్గంపై బీజేపీ ఫోకస్

మునుగోడు: మునుగోడు నియోజకవర్గంపై బీజేపీ (BJP ) ఫోకస్ పెట్టింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజాగోపాలరెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇక్కడి నియోజకవర్గ అభ్యర్థి కోసం బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థి కోసం బీజేపీ వేటను ప్రారంభించింది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ తరఫున బలమైన అభ్యర్థి ఉండడంతో అన్ని రాజకీయ సమీకరణాలను ఆలోచించిన తర్వాతే సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ ఆలోచిస్తుంది. కొంతమంది పార్టీ అధిష్ఠానాన్ని ఇప్పటికే సంప్రదింపులు చేసినట్లు సమాచారం. అయితే రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డికి గాలం వేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. మరోవైపు ఓబీసీ మోర్చా కార్యదర్శి వీరమల్ల అనిల్ కుమార్ గౌడ్ పేరును కూడా బీజేపీ నాయకత్వం పరిశీలిస్తోంది.

మునుగోడులో బీసీల ఓట్లు అధికంగా ఉండటంతో తెరపైకి గౌడ సామాజికవర్గానికి చెందిన అనిల్ కుమార్‌ను బరిలోకి ఎలా ఉంటుందని బీజేపీ అధిష్ఠానం ఆలోచిస్తుంది. అయితే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్ అల్లుడే వీరమల్ల అనిల్ కుమార్ గౌడ్ కావడం గమనార్హం. అయితే బీజేపీ అన్ని సమీకరణాలను దృష్టిలో ఉంచుకునే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని కసరత్తు చేస్తోంది.

Updated Date - 2023-10-28T17:59:03+05:30 IST