NandishwarGoud: బుల్డోజర్స్తో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్
ABN , First Publish Date - 2023-11-09T20:04:10+05:30 IST
నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియలో భాగంగా రాజకీయ నేతలు ప్రజలను ఆకట్టుకునేందుకు వినూత్న రూపంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా పటాన్చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ నామినేషన్ దాఖలు చేసేందుకు కొత్త స్టైల్ను ఎంచుకున్నారు.
హైదరాబాద్: ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు అన్ని రకాల హామీలతో విశ్వప్రయత్నాలు చేశారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియలో భాగంగా రాజకీయ నేతలు ప్రజలను ఆకట్టుకునేందుకు వినూత్న రూపంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా పటాన్చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ నామినేషన్ దాఖలు చేసేందుకు కొత్త స్టైల్ను ఎంచుకున్నారు. ఏకంగా జేసీబీలతో ర్యాలీని నిర్వహించారు. అన్ని పార్టీల నేతల మాదిరిగా కాకుండా వినూత్నంగా బుల్డోజర్స్తో ర్యాలీగా వెళ్లి పటాన్చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.