Share News

Ashok Gehlot: తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయి..

ABN , First Publish Date - 2023-11-28T13:55:21+05:30 IST

ఐదు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం ఉంటే మిజోరం ఎందుకు వెళ్ళలేదని బీజేపీ అగ్రనేతలను ఉద్దేశించి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. నేడు గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో సర్కార్ ఆటోమోడ్‌లో నడుస్తోందన్నారు.

Ashok Gehlot: తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయి..

హైదరాబాద్ : ఐదు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం ఉంటే మిజోరం ఎందుకు వెళ్ళలేదని బీజేపీ అగ్రనేతలను ఉద్దేశించి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. నేడు గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో సర్కార్ ఆటోమోడ్‌లో నడుస్తోందన్నారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు బాగున్నాయని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని తెలిసి బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోయాయన్నారు. రాజస్థాన్ లో పేపర్ లీకు కేసులో బాధ్యులపై కఠినంగా వ్యవహరించామన్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఈడీని బీజేపీ ప్రయోగిస్తోందన్నారు. అవినీతిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-28T13:56:57+05:30 IST