Jayasudha: ఢిల్లీకి సినీనటి జయసుధ.. నేడే బీజేపీలో చేరిక

ABN , First Publish Date - 2023-08-02T10:43:30+05:30 IST

సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు జయసుధ కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు.

Jayasudha: ఢిల్లీకి సినీనటి జయసుధ.. నేడే బీజేపీలో చేరిక

న్యూఢిల్లీ: సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ (Actress, Former MLA Jayasudha) బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు జయసుధ కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో జయసుధ దేశరాజధానికి చేరుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో ఈరోజు సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP National President JP Nadda) సమక్షంలో మధ్యాహ్నం జయసుధ కాషాయి కండువా కప్పుకోనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy), ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్ (Sunil Bansal), బండి సంజయ్ (Bandi Sanjay) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ విజయం సాధించారు. అయితే గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జయసుధ.. ఇప్పుడు ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ పెద్దలు జయసుధకు ఎలాంటి హామీ ఇవ్వనున్నారో చూడాలి.

Updated Date - 2023-08-02T10:43:30+05:30 IST