WTC Final: ఏడో వికెట్ కోల్పోయిన టీం ఇండియా... అభిమానులను నిరాశపర్చిన బ్యాటర్లు..

ABN , First Publish Date - 2023-06-11T16:42:03+05:30 IST

డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఐదో రోజు తొలి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా పీకల్లో కష్టాల్లో పడింది.

WTC Final: ఏడో వికెట్ కోల్పోయిన టీం ఇండియా... అభిమానులను నిరాశపర్చిన బ్యాటర్లు..

లండన్: డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఐదో రోజు తొలి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. మ్యాచ్ ఆరంభంలోనే 4,5 వికెట్ల రూపంలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఔటవ్వగా, 56.2 ఓవర్‌ వద్ద భారత్ 6వ వికెట్ కోల్పోయింది. అజింక్య రహానే 108 బంతుల్లో 46 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ కారీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

ప్రస్తుతం భారత్ 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. విజయాన్ని చేరుకోవాలంటే టీం ఇండియా ఇంకా 224 పరుగులు చేయాల్సి ఉంది.

కోహ్లీ 78 బంతుల్లో 49 పరుగులు చేసి ఆసీస్ బౌలర్ బోలాండ్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 2 బంతులు ఆడి స్కోర్ ఏం చేయకుండానే బోలాండ్ బౌలింగ్‌లో అలెక్స్ కారీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కీలకమైన రెండు వికెట్ల పడగొట్టి భారత జట్టును ఆసీస్ బౌలర్ బోలాండ్ కష్టాల్లోకి నెట్టాడు.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 270-8 వద్ద డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్సింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులు చేయగా, తొలి ఇన్సింగ్స్‌లో టీం ఇండియా 296 పరుగులు చేసింది.

Updated Date - 2023-06-11T16:50:30+05:30 IST