WTC Final Aus vs India: ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్.. 296 పరుగుల వద్ద ఆలౌట్

ABN , First Publish Date - 2023-06-09T18:52:24+05:30 IST

ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ICC World Test Championship Final)లో మ్యాచ్‌లో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 69.4 ఓవర్ల వద్ద భారత జట్టు 296 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

WTC Final Aus vs India: ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్.. 296 పరుగుల వద్ద ఆలౌట్

లండన్: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ICC World Test Championship Final) మ్యాచ్‌లో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. 69.4 ఓవర్ల వద్ద భారత జట్టు 296 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మహ్మద్ షమీ ఔట్ కావడంతో భారత్ ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ కారీకి క్యాచ్ ఇచ్చి మహ్మద్ షమీ వెనుదిరిగాడు. మహ్మద్ షమీ 11 బంతుల్లో 13 పరుగులు చేశాడు.

భోజన విరామ సమయం అనంతరం రెండో సెషన్‌ ప్రారంభమైన వెంటనే టీం ఇండియా రెండో ఓవర్‌లో 7వ వికెట్ కోల్పోయింది. 61.6 ఓవర్ వద్ద అజింక్య రహానే ఔటయ్యాడు. 129 బంతుల్లో 89 పరుగులు చేశాడు.

లంచ్ తర్వాత కమిన్స్ బౌలింగ్‌లో రహానే 89 పరుగుల వద్ద ఔటయ్యాడు. అజింక్య రహానే సెంచరీ పూర్తి చేస్తాడనుకున్న అభిమానుల ఆశలపై ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్‌ నీళ్లు చల్లాడు. కమిన్స్ వేసిన బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ క్యాచ్ పట్టుకోవడంతో అజింక్య రహానే వెనుదిరిగాడు.

టీం ఇండియా జట్టు స్కోర్ 270 పరుగులు దాటడంతో ఫాలోఆన్ గండం తప్పింది. అర్థ సెంచరీతో శార్దూల్ ఠాకూర్ భారత్‌ను ఆదుకున్నాడు. 68.4 ఓవర్ వద్ద భారత్ 9వ వికెట్ కోల్పోయింది.

భోజన విరామ సమయానికి 60 ఓవర్లలో టీం ఇండియా 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రహానే, శార్దూల్ ఠాకూర్ సెంచరీ భాగస్వామ్యంతో భారత్ స్కోర్‌ను 260 పరుగులు దాటేలా చేశారు.

Updated Date - 2023-06-09T19:08:05+05:30 IST