Share News

Sehar Shinwari: మరో ఆఫర్ ప్రకటించిన పాకిస్తానీ నటి.. భారత్‌ని న్యూజీలాండ్ ఓడిస్తే, ఆ పని చేస్తానంటూ హామీ

ABN , First Publish Date - 2023-10-22T16:36:07+05:30 IST

భారతదేశంపై పాకిస్తాన్ ఎలా తన అక్కసు వెళ్లగక్కుతుంటుందో, అలాగే అక్కడి జనాలు కూడా భారత్‌పై తమ ద్వేషాన్ని వ్యక్తపరుస్తుంటారు. తమ భవిష్యత్ గురించి ఆలోచించకుండా, ఎందులోనూ భారత్ గెలవకూడదని...

Sehar Shinwari: మరో ఆఫర్ ప్రకటించిన పాకిస్తానీ నటి.. భారత్‌ని న్యూజీలాండ్ ఓడిస్తే, ఆ పని చేస్తానంటూ హామీ

భారతదేశంపై పాకిస్తాన్ ఎలా తన అక్కసు వెళ్లగక్కుతుంటుందో, అలాగే అక్కడి జనాలు కూడా భారత్‌పై తమ ద్వేషాన్ని వ్యక్తపరుస్తుంటారు. తమ భవిష్యత్ గురించి ఆలోచించకుండా, ఎందులోనూ భారత్ గెలవకూడదని దొంగ ప్రార్థనలు చేస్తుంటారు. నటి సెహర్ షిన్వారీ సైతం అదే పని చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో.. టీమిండియా గెలవకూడదని గట్టిగా కోరుకుంటోంది. ఈ టోర్నీలోనూ తమ పాక్ జట్టుని చిత్తుచిత్తుగా ఓడించడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె.. ఏదో విధంగా భారత్‌పై విమర్శలు గుప్పిస్తూనే ఉంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టోర్నీలో భారత్ విజయం సాధించకూడదని శాపనార్థాలు పెడుతోంది. ఈ క్రమంలోనే పలు బంపరాఫర్లను ప్రకటిస్తోంది.


ఇదివరకే బంగ్లాదేశ్, భారత్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు.. సెహర్ షిన్వారీ ఒక ఆఫర్ ప్రకటించింది. భారత్‌ను బంగ్లాదేశ్ ఓడిస్తే.. ఆ జట్టులోని ఒక క్రికెటర్‌తో తాను డేటింగ్‌కి వెళ్తానని కుండబద్దలు కొట్టింది. అయితే.. ఆ కోరిక నెరవేరలేదు. బంగ్లా జట్టు భారత్ చేతిలో ఓడిపోవడంతో, ఆమె నిరాశచెందింది. అదే సమయంలో బంగ్లాదేశ్ జట్టుని వెనకేసుకొచ్చింది. బంగ్లా ఆటగాళ్లు గట్టిగా పోరాడారని, వారి హోమ్‌గ్రౌండ్‌గా భారత జట్టుని ఛాలెంజ్ చేశారంటూ కొనియాడింది. అంతేకాదు.. ఇంకా తాను నమ్మకం కోల్పోలేదని, న్యూజీలాండ్ జట్టు తప్పకుండా భారత్‌ని ఓడిస్తుందని, తప్పకుండా అమ్మమ్మ గుర్తొచ్చేల్లా భారత్ జట్టుని కివీస్ ఓడిస్తుందంటూ బీరాలు పలికింది. ‘‘ఇంట్లో గాడిద కూడా పులే అవుతుంది’’ అంటూ భారత్‌ని ట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. అందుకు భారతీయులు ఆమెకు బాగానే గడ్డి పెట్టారు.

అయినా సెహర్ బుద్ధి మారలేదు. ఇప్పుడు మరోసారి ఆ అమ్మడు బంపరాఫర్‌ను ప్రకటించింది. ఒకవేళ న్యూజీలాండ్ చేతిలో భారత జట్టు ఓడిపోతే.. అబ్దుల్లా షా ఘాజీ దర్గాలోని పేదలకు మటన్ బిర్యానీ పంచిపెడతానని మాటిచ్చింది. అసలు భారత్ ఏ మ్యాచ్‌లోనూ ఎప్పుడూ గెలవకూడదంటూ చెప్పింది. దీంతో మండిపడ్డ భారతీయ అభిమానులు.. ఆమెపై మళ్లీ ఎగబడ్డారు. ‘‘ఇంట్లో చపాతి చేసుకోవడానికి పిండి లేదు కానీ, బిర్యానీ పంచి పెడుతుందట’’ అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. పేదవాళ్లకు తినిపించేంత స్థోమత నీకు లేదని, ఎందుకంటే ఆ దర్గా దగ్గర నువ్వే బిచ్చమెత్తుకుంటున్నావంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - 2023-10-22T16:36:07+05:30 IST