WTC Final: కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం.. రేపే ఫైనల్‌ మ్యాచ్..

ABN , First Publish Date - 2023-06-06T18:21:03+05:30 IST

ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు (WTC Final) ఒకరోజు ముందు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్వల్ప గాయంతో బాధపడుతున్నాడు.

WTC Final: కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం.. రేపే ఫైనల్‌ మ్యాచ్..

లండన్: ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు (WTC Final) ఒకరోజు ముందు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు (Rohit Sharma) స్వల్ప గాయమైంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ గాయపడ్డాడు. కుడి చేయి బొటనవేలికి గాయమైంది. దీని కారణంగా ప్రాక్టీస్‌ నుంచి కొంతసేపు విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మీడియాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. కొన్ని టైటిళ్లు గెలవడం, కొన్ని అసాధారణ సిరీస్‌లు సాధించడం ఆనందంగా ఉంటుందని చెప్పాడు. ఇలాంటి సమయంలో ఎక్కువగా ఆలోచించడం ద్వారా తమపై తామే ఎక్కువ ఒత్తిడి తెచ్చుకోకూడదని భావిస్తున్నానని పేర్కొన్నాడు. ప్రతి కెప్టెన్ ఛాంపియన్‌షిప్‌లను గెలవాలని కోరుకుంటాడని, కాబట్టి తాను భిన్నంగా ఉండనని, తాను కూడా ఛాంపియన్‌షిప్ గెలవాలనుకుంటున్నానని రోహిత్ శర్మ తెలిపాడు. తాను ఈ ఉద్యోగం నుంచి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకటి లేదా రెండు ఛాంపియన్‌షిప్‌లను గెలవగలిగితే బాగుంటుందన్నాడు.

బుధవారం నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్‌ పోరు ప్రారంభం కానుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Updated Date - 2023-06-06T18:27:26+05:30 IST