WTC final: బ్యాటింగ్ ఆరంభంలోనే దెబ్బమీద దెబ్బ..

ABN , First Publish Date - 2023-06-08T19:57:18+05:30 IST

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ ఆరంభంలో దెబ్బ మీద దెబ్బ పడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. జట్టు స్కోరు 30 పరుగుల వద్దే వీరిద్దరూ ఔటయ్యారు. వ్యక్తిగత స్కోరు 15 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు.

WTC final: బ్యాటింగ్ ఆరంభంలోనే దెబ్బమీద దెబ్బ..

ఓవల్: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ ఆరంభంలో దెబ్బ మీద దెబ్బ పడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. జట్టు స్కోరు 30 పరుగుల వద్దే వీరిద్దరూ ఔటయ్యారు. వ్యక్తిగత స్కోరు 15 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వ్యక్తిగత స్కోరు 13 పరుగుల వద్ద క్లియర్ బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరూ ఔటవ్వడంతో ప్రస్తుతం చతేశ్వర పుజారా, విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి భారత స్కోరు 37/2 గా ఉంది. కాగా ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 469 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-06-08T19:57:46+05:30 IST