WTC Final Aus vs India: లంచ్ బ్రేక్ సమయానికి భారత్‌ స్కోర్ ఎంతంటే..

ABN , First Publish Date - 2023-06-09T17:14:26+05:30 IST

: ఆస్ట్రేలియాతో మూడో రోజు జరుగున్న మ్యాచ్‌లో భోజన విరామ సమయానికి 60 ఓవర్లలో టీం ఇండియా 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.

WTC Final Aus vs India: లంచ్ బ్రేక్ సమయానికి భారత్‌ స్కోర్ ఎంతంటే..

లండన్: ఆస్ట్రేలియాతో మూడో రోజు జరుగుతున్న మ్యాచ్‌లో భోజన విరామ సమయానికి 60 ఓవర్లలో టీం ఇండియా 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రహానే 122 బంతుల్లో 89 పరుగులు చేశాడు. 83 బంతుల్లో శార్దూల్ ఠాకూర్ 33 పరుగులు చేశాడు. రహానే, శార్దూల్ ఠాకూర్ సెంచరీ భాగస్వామ్యంతో భారత్ స్కోర్ 260 దాటేలా చేశారు. ప్రస్తుతం రహానే, శార్దూల్ ఠాకూర్ క్రీజులో ఉన్నారు.

కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో (Australia) జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ICC World Test Championship Final) మ్యాచ్‌లో టీం ఇండియా (India) విజయ అవకాశాలు దాదాపు చేజారిపోయినట్లే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ 469 పరుగులు సాధించడం.. భారత జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అయితే మూడో రోజు జరుగుతున్న ఈ ఉత్కంఠ పోరు తొలి ఓవర్‌లోనే టీం ఇండియా 38.2 ఓవర్ల వద్ద 152 పరుగులు చేసి 6వ వికెట్ కోల్పోయింది.

బోలాండ్ బౌలింగ్‌లో శ్రీకర్ భారత్ ఆరో వికెట్ రూపంలో ఔటయ్యాడు. దీంతో భారత్ జట్టు మరింత కష్టాల్లో పడింది. టీం ఇండియా 54.2 ఓవర్ల వద్ద 6 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. అజింక్య రహానే నిలకడగా ఆడుతూ అర్థ సెంచరీ చేసి భారత్‌ను కష్టాలను నుంచి కొంత గట్టెక్కించాడు.

Updated Date - 2023-06-09T17:20:52+05:30 IST