WPL 2023: చివరి మ్యాచ్‌లోనూ చేతులెత్తేసిన బెంగళూరు.. ముంబై ఎదుట స్వల్ప లక్ష్యం

ABN , First Publish Date - 2023-03-21T17:19:11+05:30 IST

మహిళల ప్రీమియర్ లీగ్(WPL) చివరి మ్యాచ్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు చేతులెత్తేసింది.

WPL 2023: చివరి మ్యాచ్‌లోనూ చేతులెత్తేసిన బెంగళూరు.. ముంబై ఎదుట స్వల్ప లక్ష్యం

నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(WPL) చివరి మ్యాచ్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు చేతులెత్తేసింది. ముంబై(Mumbai Indians)తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు షరా మామూలుగానే ఆడింది. మ్యాచ్‌లో ఎలాంటి మెరుపులు కనిపించలేదు. ముంబై బౌలర్ల ముందు వీరి ఆటలు సాగలేదు. వరుస వికెట్లు తీస్తూ బెంగళూరు(RCBW)ను కోలుకోలేకుండా చేశారు. ఫలితంగా ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్ చేరారు. ఎల్లిస్ పెర్రీ, రిచా ఘోష్ చెరో 29 పరుగులు చేశారు. కెప్టెన్ స్మృతి మంధాన 24 పరుగులు చేసింది. హెదర్ నైట్, కనిక అహుజ చెరో 12 పరుగులు చేశారు. ముంబై(MIW) బౌలర్లలో అమెలియా కెర్ 3 వికెట్లు తీసుకోగా, నట్ స్కివర్ బ్రంట్, ఇసీ వోంగ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Updated Date - 2023-03-21T17:20:53+05:30 IST