Rohit Sharma: గులాబీ ఇచ్చి.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ ప్రపోజ్ చేసిన రోహిత్ శర్మ.. ఎవరికో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2023-03-20T16:21:09+05:30 IST

ఆస్ట్రేలియా(Australia)తో వైజాగ్‌లో జరిగిన రెండో వన్డే(Vizag One Day)లో భారత జట్టు(Team

Rohit Sharma: గులాబీ ఇచ్చి.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ ప్రపోజ్ చేసిన రోహిత్ శర్మ.. ఎవరికో తెలిస్తే షాక్!

విశాఖపట్నం: ఆస్ట్రేలియా(Australia)తో వైజాగ్‌లో జరిగిన రెండో వన్డే(Vizag One Day)లో భారత జట్టు(Team India) దారుణంగా ఓడిపోయింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. దీంతో ఈ నెల 22న చెన్నైలో జరగనున్న మూడో వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.

తొలి వన్డేకు దూరమైన టీమిండియా స్కిప్పర్ రోహిత్ శర్మ(Rohit Sharma) రెండో వన్డే కోసం జట్టు సభ్యులతో కలిసి వైజాగ్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ ఓ అభిమానిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. వైజాగ్ చేరుకున్న క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం లభించింది. జట్టు సభ్యులతో కలిసి బయటకు వస్తున్న సమయంలో ఓ ఫన్నీ సంఘటన జరిగింది.

బయటకు వస్తున్న టీమిండియా క్రికెటర్లను ఓ అభిమాని సెల్ఫీ తీస్తుండగా అతడి వద్దకు వచ్చిన రోహిత్.. తన చేతిలోని గులాబీ పువ్వును ఇచ్చి.. ‘‘యే లో, ఆప్ కే లియే’’ (ఇది తీసుకో, నీ కోసమే) అని చెబుతూ అతడిని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తాడు. పొంగిపోయిన అభిమాని థ్యాంక్స్ చెబుతుండగానే.. ‘‘విల్ యు మ్యారీ మీ’’ (నన్ను పెళ్లి చేసుకుంటావా?) అని అడగడంతో అభిమాని షాకయ్యాడు. ఏం చెప్పాలో తెలియక ఫేస్ అదోలా పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ తిరుగుతోంది.

Updated Date - 2023-03-20T16:21:09+05:30 IST