WTC Final: గెలిపిస్తాడనుకున్న కోహ్లీ.. ఆ వెంటనే జడేజా ఔట్.. భారత గెలుపు ఇక దాదాపు..

ABN , First Publish Date - 2023-06-11T15:44:41+05:30 IST

డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఐదో రోజు తొలి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా కొద్ది సేపటి వరకు బాగా రాణించినప్పటికీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది.

WTC Final:  గెలిపిస్తాడనుకున్న కోహ్లీ.. ఆ వెంటనే జడేజా ఔట్.. భారత గెలుపు ఇక దాదాపు..

లండన్: డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఐదో రోజు తొలి సెషన్‌ ఆట ప్రారంభమైంది. ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్‌కు దెబ్బ మీద దెబ్బ పడింది. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రూపంలో వికెట్లు పడ్డాయి.

శనివారం నిలకడమైన విరాట్ కోహ్లీ వ్యక్తిగత స్కోరు 49 పరుగుల వద్ద బొలాండ్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్యాచ్‌ను స్మిత్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా డకౌట్‌గా వెనుదిరిగాడు. బొలాండ్ బౌలింగ్‌లో అలెక్సీ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా ప్రస్తుతం 51 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 194/5గా ఉంది. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే, శ్రీకర్ భరత్ ఉన్నారు. ఇక భారత్ విజయానికి 249 పరుగులు అవసరమవ్వగా.. ఆసీస్ కేవలం 5 వికెట్ల దూరంలో ఉంది.

కాగా వెంటవెంటనే రెండు కీలకమైన వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత గెలుపు ఇక దాదాపు కష్టమనే చెప్పాలి. భారత విజయావకాశాలు సన్నగిల్లినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం క్రీజులో ఉన్న అజింక్యా రహానే, శ్రీకర్ భరత్ ఎంతవరకు రాణిస్తారో చూడాలి.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 270-8 వద్ద డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్సింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులు చేయగా, తొలి ఇన్సింగ్స్‌లో టీం ఇండియా 296 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-06-11T16:06:21+05:30 IST