YS Jagan: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తాడేపల్లి ప్యాలెస్ షేక్ అవుతుందా?

ABN , First Publish Date - 2023-03-25T18:43:21+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తాడేపల్లి ప్యాలెస్ షేక్ అవుతుందా? ఓటమిని జీర్ణించుకోలేక లోలోపల రగిలిపోతున్నారా? స్ర్కిప్టు మారడంతో వైసీపీ అధినేతలో భయం మొదలైందా? పబ్లిక్ మీటింగ్‌లలో విసిరే ఛాలెంజ్‌లు ఏమయ్యాయి..? అవుననే తాజా పరిణామాలు చెప్తున్నాయి.

YS Jagan: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తాడేపల్లి ప్యాలెస్ షేక్ అవుతుందా?

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తాడేపల్లి ప్యాలెస్ షేక్ అవుతుందా? ఓటమిని జీర్ణించుకోలేక లోలోపల రగిలిపోతున్నారా? స్ర్కిప్టు మారడంతో వైసీపీ అధినేతలో భయం మొదలైందా? పబ్లిక్ మీటింగ్‌లలో విసిరే ఛాలెంజ్‌లు ఏమయ్యాయి..? అవుననే తాజా పరిణామాలు చెప్తున్నాయి.

అమరావతి: గతంలో వైస్ ఎస్ జగన్ ప్రతిపక్షాలు, మీడియాపై ఓ రేంజ్ చెలరేగిపోయేవారు.. వైనాట్ 175.. దమ్ముంటే చంద్రబాబుగానీ, దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ విడివిడిగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటూ వైఎస్ జగన్ పదేపదే ఏ సభలో ప్రసంగించినా ఇదే తీరులో విమర్శలుగుప్పించేవారు. మీడియా పైకూడా తన దురుసు తనాన్ని విచ్చలవిడిగా ప్రదర్శించారు. దుష్ట చతుష్టయం అంటూ.. ఏబీన్ ఆంధ్రజ్యోతి మరికొన్ని ఛానళ్లపై విరుచుకుపడిన సందర్బాలు అనేకం ఉన్నాయి. రాష్ట్రంలో తనకు ఏ పత్రికలు గానీ, ఛానళ్లు గానీ లేవు.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చాలా ఛానళ్లు ఉన్నాయి.. ఏ పత్రిక, ఏ ఛానల్ అండ లేని మీ బిడ్డను మీ కాపాడుకోవాలి అంటూ స్పీచ్‌లు దంచికొట్టేవారు. అంతే కాకుండా 175 నియోజకవర్గాల్లో చంద్రబాబుగానీ, ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ గానీ దమ్ముంటే ఒంటిరిగా పోటీచేయాలంటూ పలు సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేసిన వైఎస్ జగన్.. మొత్తానికి ఆయన ప్రసంగం సరళి ఈ రోజు మారింది.

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జరిగిన వైఎస్సార్ ఆసరాపథకం కింద డ్వాక్రా మహిళలకు రూ. 6వేల కోట్లు డీబీటీ ద్వారా ట్రాన్స్‌ఫర్ కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించిన సీఎం జగన్ ప్రారంభించారు. డీబీటి అంటే డైరెక్ట్ బెన్‌ఫిట్ ట్రాన్స్‌ఫర్‌ను మేం అమలు చేస్తున్నాం.. గతంలో డీపీటీ అంటే దోచుకో.. పంచుకో.. తినుకో అనే పథకాన్ని చంద్రబాబు అమలు చేశారు. ఆయనతోపాటు సదరు పత్రికల అధిపతులు కూడా చాలా డబ్బులు తిన్నారని అసంబద్దమైన, సహేతకంకానీ ఆరోపణలు వైస్ జగన్ చేసేవారు. కానీ దెందులూరులో ఇవాళ ఇలాంటి ఆరోపణలు గానీ, విమర్శలు గానీ చేయలేదు. మొత్తానికి వైస్ జగన్‌కు తత్వం బోధపడిందని ప్రతిపక్షాలు అంటున్నాయి.

కాగా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ వెస్ట్, రాయలసీమ ఈస్ట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 10 శాతం ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందడం..వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతోపాటు.. ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీ ఓటమితో వైఎస్ జగన్‌కు తత్వం బోధపడిందని ప్రతిపక్షాలు అంటున్నాయి.

దీంతో పాటు రాయలసీమ వైఎస్పార్సీపీకి, జగన్‌కు కంచుకోట అని పదే పదే చెబుతున్న వైసీపీ నేతలు.. 2019 ఎన్నికల్లో 50శాతం పైగా ఓటింగ్‌తో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ సీట్లను గెలుచుకున్నామని చెబుతున్న వైసీపీ నేతలు.. ఈ నాలుగేళ్లలో వచ్చిన మార్పులతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వైసీపీకి కంచుకోట అయిన రాయలసీమ వెస్ట్‌లోని కడప, కర్నూలు, అనంతపురం, రాయలసీమ ఈస్ట్ నియోజవకవర్గాలు అంటే దక్షిణ కోస్తాలో ఉన్న ప్రకాశం నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు జిల్లాల్లో గతంలో వైసీపీ స్వీప్ చేసింది. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. కుప్పంలో చంద్రబాబు, పార్వతీపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవులు గెలుపొందారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలో మూడు సీట్లు మాత్రమే గెలుపొందిన టీడీపీ.. ఈసారి రాయలసీమ వెస్ట్ నియోజవర్గంలో టీడీపీ అభ్యర్తి.. పైగా వైఎస్ జగన్ ప్రాతినధ్య వహిస్తున్న పులివెందులకు చెందిన రాంగోపాల్‌రెడ్డి గెలుపొందడం ఆ పార్టీ షాక్‌కు గురైంది. రాయలసీమ ఈస్ట్ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక ఉత్తరాంధ్రలో చిరంజీవిరావు, అనూహ్య గెలుపు సాధించి.. దాదాపు 23శాతానికి పైగా ఓట్లతో విజయదుంధుభీ మోగించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకు దాదాపుగా షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే వైస్ జగన్ దెందులూరు సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరిస్థితి ఇలా ఉంటే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను నమ్ముకున్న నెల్లూరు పెద్దారెడ్డిలు ముగ్గురు పార్టీ గుడ్ బై చెప్పడం.. వైస్ జగన్‌కు హ్యాండ్ ఇవ్వడంతో ఆ పార్టీకి, జగన్‌కి కోలుకోలేని దెబ్బకొట్టింది.

నెల్లూరు పెద్దారెడ్డిలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు వైఎస్ జగన్‌కి హ్యాండ్ ఇవ్వడంతో పార్టీనుంచి ఈ ముగ్గురిని సస్పండ్ చేయడం.. ఇదే సమయంలో రాజధాని అమరావతిలో ఉన్న తాటికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా వ్యతిరేకంగా ఉండటంతో వైఎస్సార్సీపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ అనూహ్య విజయం సాధించడంతో వైసీపీ నేతల మైండ్ బ్లాంక్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వైఎస్ జగన్ ప్రసంగం తీరులో మార్పు వచ్చిందని ప్రతిపక్షాలు అంటున్నాయి.

Updated Date - 2023-03-25T18:43:21+05:30 IST