Bihar: ఇలాంటి భర్తతో కలిసి ఉండలేను.. విడాకులు ఇప్పించండంటూ కేసు పెట్టిందో భార్య.. అసలు కథేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-01-26T20:59:19+05:30 IST

భర్త దురాగతాలు భరించలేని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనకు విడాకులు ఇప్పించాలంటూ వేడుకుంది.

Bihar: ఇలాంటి భర్తతో కలిసి ఉండలేను.. విడాకులు ఇప్పించండంటూ కేసు పెట్టిందో భార్య.. అసలు కథేంటో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: భార్య అంటే దేవుడిచ్చిన స్నేహితురాలని భారత సంప్రదాయం చెబుతోంది. కానీ..కొందరు దుర్మాగులు తమ భార్యలపై దారుణాలకు తెగబడుతుంటారు. అలాంటి ఓ వ్యక్తి దురాగతాలు తట్టుకోలేక అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తతో కలిసి ఉండలేనన్న ఆమె విడాకులు ఇప్పించాలంటూ మొరపెట్టుకుంది. అసలేం జరిగిందంటే..

బీహార్ రాష్ట్రం సమస్తీపూర్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్త చేతుల్లో చిత్రహింసలకు గురైంది. ఆమె భర్త డ్రగ్స్, మద్యానికి అలవాటుపడ్డాడు. మద్యం అక్రమరవాణాకు సంబంధించి అతడిపై గతంలో ఓ కేసు కూడా నమోదైంది. అయితే..తనపై కేసుకు భార్యే కారణమని భావించి ఆమెను నిత్యం వేధించేవాడు. ఓ సందర్భంలో ఆమెను చెట్టుకు కట్టేసి ఇష్టారీతిన కొట్టాడు. ఆ తరువాత..ఇరు కుటుంబాల వారి సమక్షంలో పంచాయితీ జరగ్గా దంపతుల మధ్య రాజీకుదిరింది. ఆ తరువాత కొద్ది రోజులకే భర్త మళ్లీ తన రాక్షసత్వాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు.

జనవరి 22 రాత్రి సమయంలో ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికొచ్చిన అతడు తన స్నేహితులతో గడపాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో ముగ్గరూ కలిసి ఆమెను చితకబాదారు. దీంతో ఆమె వారి నుంచి తప్పించుకుని తన బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే..కొందరు గ్రామస్తులు తన భార్యను కిడ్నాప్ చేశారంటూ అతడు ఫిర్యాదు చేసినట్టు తెలుసుకున్న బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. విడాకులు ఇప్పించాలంటూ వారిని వేడుకుంది.

Updated Date - 2023-01-26T21:09:17+05:30 IST