Crime: తమ్ముడే కదా అని ఇంట్లో పెట్టుకున్నాడు.. నెల రోజుల్లోనే అతడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఎంతకు తెగించాడంటే..

ABN , First Publish Date - 2023-06-18T19:43:50+05:30 IST

పాపం.. ఆ వ్యక్తి అమాయకత్వమే అతడి కొంప ముంచింది.. బంధువును ఆపదలో ఆదుకుని ఇంట్లో ఉంచినందుకు దారుణం జరిగింది.. ఏకంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురైంది.. రాజస్థాన్‌లోని కోటలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది..

Crime: తమ్ముడే కదా అని ఇంట్లో పెట్టుకున్నాడు.. నెల రోజుల్లోనే అతడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఎంతకు తెగించాడంటే..

పాపం.. ఆ వ్యక్తి అమాయకత్వమే అతడి కొంప ముంచింది.. బంధువును ఆపదలో ఆదుకుని ఇంట్లో ఉంచినందుకు దారుణం జరిగింది.. ఏకంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురైంది.. రాజస్థాన్‌ (Rajasthan)లోని కోటలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.. కోటలోని అనంత్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో గోవింద్ (40) అనే వ్యక్తి తన భార్య లక్ష్మితో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. గోవింద్ ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సరిగ్గా నెల రోజుల క్రితం సునీల్ అనే బంధువును గోవింద్ ఆదరించాడు (Crime News).

కోటలో ఉంటూ ఏదైనా పని చేసుకుంటానంటే తాత్కాలికంగా తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. అదే గోవింద్ చేసిన పెద్ద తప్పు అయి పోయింది. గోవింద్ ఇంట్లో లేనపుడు అతడి భార్య లక్ష్మిన సునీల్ ట్రాప్ చేశాడు. ఆమెను మాయ మాటలతో వలలో వేసుకుని ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. గోవింద్‌కు తెలియకుండా ఇద్దరూ తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి ముగ్గూరు కలిసి భోజనం చేశారు. ఆ సమయంలో వారి మధ్య ఏదో విషయమై గొడవ ప్రారంభమైంది.

Viral: పెళ్లి కూతురిని అలా అడిగినందుకు ఆగ్రహం.. వరుడిని చెట్టుకు కట్టేసిన వధువు కుటుంబీకులు.. అసలేం జరిగిందంటే..

ఆ గొడవలో సునీల్, లక్ష్మి ఒక్కటై గోవింద్‌పై దాడికి దిగారు. ఓ పెద్ద సుత్తితో ఇద్దరూ కలిసి గోవింద్ తలపై కొట్టి చంపేశారు (Wife killed Husband). అనంతరం ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే పారిపోయారు. ఆదివారం ఉదయం ఇంటి యజమాని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపులు ప్రారంభించారు.

Updated Date - 2023-06-18T19:43:50+05:30 IST