Vijay Sethupathi: ‘అలా పిలవకండి.. ఇబ్బందిగా ఉంటుంది’

ABN , First Publish Date - 2023-02-08T15:14:54+05:30 IST

దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఒకరు. కోలీవుడ్‌ (Kollywood)లో స్టార్‌గా ఉన్న ఈ నటుడు అనంతరం ఇతర దక్షిణాది చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు సాధించాడు.

Vijay Sethupathi: ‘అలా పిలవకండి.. ఇబ్బందిగా ఉంటుంది’
Vijay Sethupathi

దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఒకరు. కోలీవుడ్‌ (Kollywood)లో స్టార్‌గా ఉన్న ఈ నటుడు అనంతరం ఇతర దక్షిణాది చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు సాధించాడు. ఈ నటుడు ప్రస్తుతం బాలీవుడ్‌(Bollywood)లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈయన ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్’తో పాపులర్ అయిన దర్శక ద్వయం రాజ్ & డీకే డైరెక్షన్‌లో వస్తున్న వెబ్‌సిరీస్ ‘ఫర్జీ’ (Farzi)లో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ వెబ్‌‌సిరీస్‌లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే నటి రాశిఖన్నా సైతం కీలక పాత్రలో నటిస్తోంది.

ఈ వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ టీం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్ సేతుపతి పాల్గొన్నాడు. అందులో ఓ రిపోర్టర్ విజయ్ సేతుపతిని ‘పాన్ ఇండియా స్టార్’ అని సంభోధించాడు. దానికి విజయ్ సేతుపతి అభ్యంతరం చెబుతూ.. ‘లేదు సర్, నేను నటుడిని మాత్రమే. ఆ పాన్ ఇండియా స్టేట్‌మెంట్ వింటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు అది ఒత్తిడికి కారణం అవుతుంది. నేను నటుడిని మాత్రమే. దానికి లేబుల్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను ప్రతి భాషలో సినిమా చేయాలనుకుంటున్నాను. బెంగాలీ సినిమా, గుజరాతీ సినిమాలు కూడా చేయాలనుకుంటున్నాను. కాబట్టి నాకు అవకాశం దొరికితే.. అక్కడి చిత్రాల్లో నటిస్తాను’ అని చెప్పుకొచ్చాడు.

ఇదే విషయంపై నటి రాశిఖన్నా మాట్లాడుతూ.. ‘నాకు కూడా అది నచ్చదు. మేం అందరం నటులం మాత్రమే. అది ఇది అంటూ విడదీయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని విడదీశారు. కొన్ని రోజులుగా నార్త్, సౌత్ అని.. ఇప్పుడేమో పాన్ ఇండియా అని విడదీస్తున్నారు’ అని కొంచెం ఘాటుగానే స్పందించింది.

Updated Date - 2023-02-08T15:14:55+05:30 IST