Samantha: దేవాలయాన్ని దర్శించుకున్న సామ్.. ప్రతి మెట్టుపై హారతి కర్పూరం..

ABN , First Publish Date - 2023-02-15T16:15:01+05:30 IST

ఏ పాత్రను అయిన అలవోకగా పోషించే నటి సమంత (Samantha). కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మయోసైటిస్‌కు చికిత్సను తీసుకుంటున్నారు. ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న సామ్ మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలను దర్శించుకుంటున్నారు.

Samantha: దేవాలయాన్ని దర్శించుకున్న సామ్.. ప్రతి మెట్టుపై హారతి కర్పూరం..

ఏ పాత్రను అయిన అలవోకగా పోషించే నటి సమంత (Samantha). కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మయోసైటిస్‌కు చికిత్సను తీసుకుంటున్నారు. ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న సామ్ మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలను దర్శించుకుంటున్నారు. తాజాగా తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. ఆ దేవాలయంలో 600మెట్లు ఉండగా ప్రతి మెట్టుపై హారతి కర్పూరం వెలిగించారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులందరు షేర్ చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని దేవాలయంలో సామ్ ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.

Sam.jpg

సమంత రుత్ ప్రభు మయోసైటిస్‌తో బాధపడుతుంటంతో క్రమం తప్పకుండా ఐవీఐజీ సెషన్‌కు హాజరవుతున్నారు. ఈ సెషన్‌లో పాల్గొంటున్న ఫొటోలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇక సామ్ కెరీర్ విషయానికి వస్తే.. ‘సిటాడెల్’ (Citadel) వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ను ఈ మధ్యనే ప్రారంభించారు. ఈ షోలో గూఢచారి పాత్రను పోషిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ‘అవెంజర్స్’ ఫేమ్ రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్నారు. గుణశేఖర్‌ దర్శకత్వంలోను ‘శాకుంతలం’ (Shaakuntalam) లో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. విజయ్ దేవరక కొండ హీరోగా నటిస్తున్న ‘ఖుషి’ (Kushi) ని త్వరలోనే పట్టాలెక్కిస్తానని చెప్పారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.

Updated Date - 2023-02-15T16:15:15+05:30 IST